కరోనా వైరస్పై పోరాటానికి టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నేను సైతం అంటూ కదం తొక్కారు. తన వంతుగా తెలుగు రాష్ట్రాలకు ఆయన రూ. కోటి 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. కరోనా కట్టడి కోసం పోరాటం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గత కొన్నిరోజుల నుంచి సినీ తారలు తమవంతు ఆర్థికసాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ రూ.1.25 కోట్లు విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు సాయం ప్రకటించిన ఆయన.. అందులో రూ.50లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, మరో రూ.50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సహాయనిధికి అందించనున్నారు. తెలుగు సినీ కార్మికుల సహాయార్థం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీసీ(కరోనా క్రైసిస్ ఛారిటీ)కి రూ.25 లక్షలు ప్రకటించారు. ఈ మేరకు రూ.25లక్షల చెక్కును ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సి.కల్యాణ్కు అందించారు. ఇక తెలంగాణలో మంత్రి కేటీఆర్ ను కలసి స్వయంగా రూ.50లక్షల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందులేని కరోనావైరస్ మహమ్మారిని జయించేందుకు ప్రజల వద్ద ఉన్న ఒకే ఆయుధం సామాజిక దూరం అని దానిని ప్రజలందరూ పాటించాలని అన్నారు. ఇక కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమై తగిన జాగ్రత్తలు పాటించి కరోనాను అరికట్టాలని బాలకృష్ణ సూచించారు. శుభ్రతను పాటించి పరిశ్రభ వాతావరణ మధ్య వుంటూ ఎంతటి కరోనా వైరసైనా దరి చేరదని ఆయన ప్రజలకు ధైర్యం చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్లో ఇటు ఫ్యామిలీ... Read more