మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తరువాత తెరకెక్కుతున్న మూడవ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ రూపోందించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. వాటిని చిరంజీవినే స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. ఆయనతో పాటు మణి శర్మ, దర్శకుడు కొరటాల శివ ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్ ల కోసం బ్యాంకాక్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంకాక్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.
కాగా ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారని.. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు సమాచా
డిసెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభించి.. జూలై నాటికి అన్ని పనులు పూర్తిచేసి, ఆగస్టు 14న చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో కొరటాల వున్నారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాచీన దేవాలయాలు .. ఆ దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్లో ఇటు ఫ్యామిలీ... Read more