టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ‘అర్జున్ సురవరం’ చిత్రం మరోసారి వాయిదా పడింది. టీఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విడుదలకు మరోమారు బ్రేకులు పడ్డాయి. అయితే ఈ సారి చిత్ర నిర్మాణ యూనిట్ కు ఏమాత్రం సంబంధం లేకున్నా.. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు కోరడంతో వారు అంగీకరించారు. ఈ మేరకు చిత్ర డిస్ట్రిబ్యూటర్లు ఓ ప్రకటనను విడుదల చేశారు. వారి ప్రకటన సారంశమేమిటంటే..
‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డు క్లీన్ u/a సర్టిఫికేట్ ఇచ్చింది. థియేట్రికల్ హక్కులను కూడా దక్కించుకున్నాం. సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. కాకపోతే.. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’, తదితర సినిమాలు విడుదల అవుతున్న క్రమంలో మా సినిమాను ప్రదర్శించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి మల్టీప్లెక్స్లలో విడుదల చేయడానికి అస్సలు వీలు పడటంలేదు. దాంతో నిర్మాతలను, చిత్రబృందాన్ని సంప్రదించి సినిమాను మరో తేదీన విడుదల చేయాలని కోరాం. ఇందుకు వారూ ఒప్పుకోవడంతో ‘మహర్షి’ విడుదలైన తర్వాతే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
యంగ్ హీరో నిఖిల్ విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలను ఎంచుకుంటాడన్న టాక్ వుంది. ఈ క్రమంలో తొలిసారి జర్నలిస్టు పాత్రలో నటిస్తున్న ‘అర్జున్ సురవరం’ చిత్రం ఇప్పటికే ఎన్నో సమస్యలు అధిగమించింది. తొలుత సినిమాకు ‘ముద్ర’ అనే టైటిల్ ను ఖరారు చేసి పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కానీ ఓ తమిళ చిత్రబృందం ఇదే టైటిల్ ను కాపీ కొట్టి సినిమాను ప్లాన్ చేసింది. దాంతో మరో టైటిల్ ను రిజిస్టర్ చేయించాల్సి వచ్చింది. టీఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 9న మహర్షి చిత్రం విడుదలైన తరువాత మరో తేధీని ఖరారు చేసుకుని విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more
May 21 | రామ్ హీరోగా లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన... Read more
May 21 | పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా... Read more
May 20 | ప్రయోగాత్మక కథలను.. నటనకు అస్కారమున్న పాత్రలను అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో నటించే స్కోప్ వున్న చిత్రాలను ఎంచుకోవడంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. చిత్రం ఎలాంటిదైనా ఆయాపాత్రలలో పరకాయ ప్రవేశం చేసిరా అన్నట్లుగా... Read more