ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజ్ పాల్ యాదవ్ కు ఢిల్లీలోని న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అతనితో పాటు అతని భార్యను, అతినికి చెందిన ఓ కంపెనీని కూడా న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కమేడియన్ రాజ్ పాల్ యాదవ్ తో పాటు అతని భార్యకు కూడా న్యాయస్థానం అరు మాసాల జైలు శిక్షను విధించాలని తీర్పు వెలువరించింది. కాగా, ఈ తీర్పు నేపథ్యంలో న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ వేసుకున్న నటుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఎంజీ అగర్వాల్ నుంచి తన తొలి హిందీ చిత్రం ‘అతా పతా లపతా’ కోసం 2010లో రాజ్ పాల్ యాదవ్ 5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. 2012లో చిత్రాన్ని విడుదల చేసిన తరువాత కూడా ఆయన తీసుకున్న రుణాన్ని మాత్రం చెల్లించలేదు. దీంతో తన డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో వ్యాపారవేత్త అగర్వాల్ ఢిల్లీలోని కర్ కర్ డుమా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో పలు మార్లు న్యాయస్థానానికి కూడా రాజ్ పాల్ హాజరుకాకపోవడంతో గతంలో పది రోజుల పాటు జుడీషియల్ కస్టడీకి కూడా న్యాయస్థానం పంపింది.
కాగా, దీనిని విచారించిన న్యాయస్థానం రాజ్ పాల్ ను దోషిగా తేల్చి, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. అతనితో పాటు అతని భార్యను, వారికి చెందిన ఓ కంపెనీని న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. అయితే కేసు తీర్పు నేపథ్యంలో తన తరపు న్యాయవాదులతో బెయిల్ కి దరఖాస్తు చేసుకోగా, రాజ్ పాల్ కు వెంటనే మంజూరైంది. కాగా, రాజ్ పాల్ యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను న్యాయస్తానం తీర్పును గౌరవిస్తానని, అయితే ఈ తీర్పును తాను ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్లు పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more