Cinema Theatres Bandh from Tomorrow | రేపటి నుంచి థియేటర్లు బంద్.. లేకపోతే భవిష్యత్తులో కష్టమే : సురేష్ బాబు

Theaters bandh in south india

Suresh Babu, Theaters Bandh, Digital Service Providers, Save Producers, Theaters Bandh Suresh Babu, Suresh Babu Press Meet

Cinema Theatres Bandh from Tomorrow Across South India Against Digital Service Providers. Tollywood Top Producer Suresh Babu Confirmed it.

రేపటి నుంచి థియేటర్లు బంద్ : సురేష్ బాబు

Posted: 03/01/2018 04:50 PM IST
Theaters bandh in south india

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ థియేటర్ల బంద్‌కు దక్షిణాది నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై హైద‌రాబాద్‌లో నిర్మాతలు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సురేశ్ బాబు బంద్ కొనసాగుతుందని ధృవీకరించారు.

‘సినిమా థియేటర్ల బందుతో వచ్చే నష్టం కన్నా, తాము ఈ నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో వచ్చే నష్టమే ఎక్కువ’ అని చెప్పారు. అన్ని విషయాలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాము తీసుకుంటోన్న చర్యలతో భవిష్యత్తులో చిన్న సినిమాలకు కూడా లాభదాయకమని అన్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్ల బంద్ ఉంటుందని చెప్పారు. ఐదు రాష్ట్రాల నిర్మాతలతో సంయుక్తంగా ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసుకున్నామని సురేశ్ బాబు చెప్పారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు పీపీఎఫ్ తగ్గించట్లేదని తెలిపారు. కాగా, బంద్ మూలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 2400 థియేటర్లలో 2000 మూతపడనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles