మల్లూ బ్యూటీ నిత్యామీనన్ ఏడాది కాలంగా టాలీవుడ్ లో కొత్త సినిమాలేవీ ఒప్పుకోవటం లేదు. మహానటితోపాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను వదులుకుని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఫిట్ నెస్ మీద దృష్టిసారించి స్లిమ్ అవతార్ లోకి మారింది.
ఈ నేపథ్యంలో ఆమె ఓ కొత్త సినిమాకు సైన్ చేయబోతుందని తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా (ఆటా నాదే.. వేటా నాదే... టైటిల్ పరిశీలనలో ఉంది) చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం నిత్యామీనన్ ను ఆల్ మోస్ట్ ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గతంలో వీరిద్దరి కాంబోలోనే ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రం రావాల్సి ఉంది. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయ్యాక కూడా ఆ చిత్రం ఎందుకనో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తేజ కాంబో చిత్రంలో వీరిద్దరూ ఒకటిగా నటించబోతున్నారన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. డిసెంబర్ 13 నుంచి తేజ-వెంకీ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more