సెలబ్రిటీల మూలంగా సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వారికి భద్రతా పేరిట సిబ్బంది చేసే అతి మూలంగా విమర్శలు వెలువెత్తుతున్న తీరు మాత్రం మారటం లేదు. ముఖ్యంగా నటీనటులు చిత్ర ప్రమోషన్ల కోసం రోడ్లెక్కి చేస్తున్న అతి వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సిద్ధార్థ మల్హోత్రా, కత్రినాలు వేస్తున్న వేషాలకు ఇప్పుడు చిర్రెత్తిపోతున్నారు జనాలు.
సెప్టెంబర్ 9న బార్ బార్ దేఖో విడుదల అవుతుండగా, చిత్ర ప్రమోషన్ల సందర్భంగా ఈ జంట రోడ్లెక్కి డాన్సులు, ఫోటోలతో తెగ హల్ చేస్తున్నారు. లోకల్ ట్రైన్ లు, రైల్వే స్టేషన్లు, రోడ్లు, బస్టాండ్లు ఇలా వేటికి వదలకుండా డాన్సులు చేస్తూ హడావుడి చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్, భద్రత పేరిట సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో వీరు చేసిన వెర్రి చేష్టలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏంటంటే... ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ-317లో వీరిద్దరూ సెప్టెంబర్ 5 రాత్రి జర్నీ చేయాల్సి ఉంది. ఫ్లైట్ షెడ్యూల్డ్ టైమ్ రాత్రి 9.40 కాగా.. సరైన సమయానికే కేట్ - సిద్ లు ఎయిర్ పోర్టుకు వచ్చారు.. బోర్డింగ్ పాస్ లు కూడా తీసుకున్నారు.
అయితే.. అక్కడి నుంచి ఫ్లైట్ దగ్గరకు మాత్రం రాలేదు. ఎయిరిండియా అధికారులు ఎన్ని సార్లు ఫైనల్ కాల్స్ ఇచ్చినా.. వీరు మాత్రం ఫ్లైట్ దగ్గరకు రాలేదు. ఇంతకీ విమానం ఎక్కుకుండా వీళ్లేం చేస్తున్నారంటే.. డ్యూటీ ఫ్రీ ఏరియాలో ఎంచక్కా తమ లేటెస్ట్ మూవీ 'బార్ బార్ దేఖో' చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా 10.45వరకూ ఫ్లైట్ ను నిలిపి ఉంచారు అధికారులు. చివరికి హడావుడి ముగిశాక తాపీగా వీరిద్దరు ఫ్లైట్ ఎక్కకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత అదంతా చిత్ర ప్రమోషన్ కోసమేనని తెలియటంతో ప్రయాణికులు ఆగ్రహాం వ్యక్తంచేసినప్పటికీ ఫ్లైట్ కదలటంతో కాస్త శాంతించారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవటంతో అధికారులు కూడా లైట్ తీస్కున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more