‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా మారాడు ఓంకార్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ‘రాజుగారిగది’ సినిమాతో మనముందుకు వస్తున్నాడు. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్, ధన్య బాలకృష్ణన్, చేతన్ చీను, ఈశాన్య, పూర్ణ ప్రధాన పాత్రలలో నటించారు.
హర్రర్ కామెడీ క్రైం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్ర రన్ టైం 135 నిమిషాలు. తక్కువ రన్ టైంలో, స్పీడ్ స్ర్కీన్ ప్లే ఈ సినిమాకు పెద్ద హెల్ప్ అవుతుందని ఓంకార్ అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమా సీక్వెల్ కోసం సెకండ్ పార్ట్ కథను కూడా సిద్ధం చేసాడట ఓంకార్.
ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని వారాహిచలన చిత్రం, అనిల్ సుంకర సమర్పణలో ఓఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ప్రై.లి. పతాకంపై రూపొందించారు. ఈ చిత్రాన్ని ఈనెల 22న దసరా కానుకగా విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more