ఎప్పుడో భూమి పుట్టినప్పుడు విడుదల కావాల్సిన ‘రుద్రమదేవి’ చిత్రం.. అదిగో, ఇదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చింది. ఆమధ్య చిత్రబృందం రెండు విడుదల తేదీలను ప్రకటించింది కానీ.. గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదంటూ మళ్లీ వాయిదా వేసేసింది. చివరగా దర్శకుడు గుణశేఖర్ అక్టోబర్ 9వ తేదీన విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొన్నీమధ్యే మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రచారాలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో.. ప్రపంచం తలక్రిందులైనా సరే అక్టోబర్ 9న రిలీజ్ చేస్తామని బల్లగుద్దిమరీ చెప్పారు. కానీ.. ఓ చిన్న మార్పుతో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ 3డీ ఫార్మాట్ లో రిలీజవుతుందని ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం.. ఆ వర్క్ ఫినిష్ కాకపోవడంతో 2డీ లోనే రిలీజ్ కానుందని విశ్వసనీయవర్గాల సమాచారం.
ఈ సినిమా కోసం గుణశేఖర్ దాదాపు తొమ్మిదేళ్లపాటు రీసర్చ్ చేసి.. గత మూడేళ్ళుగా ఎంతో కష్టపడి ఈ పిరియాడికల్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ కట్టిపడేలా వుండేలా గుణశేఖర్ గతకొన్నాళ్ల నుంచి వర్క్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 3డీ ఫార్మాట్ కోసం అహర్నిశలు శ్రమించారు. నిజానికి ‘రుద్రమదేవి’ ఇన్నాళ్లూ వాయిదా పడుతూ రావడానికి ప్రధాన కారణం.. సినిమాకి సంబందించిన 3డి వర్క్ ఫినిష్ కాకపోవడమే! దానికోసమే ఇన్నాళ్లూ గుణ టీమ్ చాలా కష్టపడింది. అనుకున్నట్లే అన్ని ఫినిష్ చేసి రిలీజ్ చేద్దామని యూనిట్ భావించింది కానీ.. అది కుదరడం లేదని సమాచారం. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో 2డి లోనే రిలీజ్ చేయనున్నారని తెలిసింది. ఈ వార్త సినీ అభిమానుల్ని కాస్త నిరాశకు గురి చేసింది. ఇన్ని రోజులు దేనికోసమైతే ఆగారో దానినే ఆపేసి రిలీజ్ చేయాల్సి వస్తే.. ఇన్నాళ్ల సమయం ఎందుకు తీసుకున్నారోనంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అటు.. సినీ వర్గాల్లో ఈ విధంగానే చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లూ కష్టపడి ఇప్పుడు 2డీలోనే రిలీజ్ చేస్తే.. ఇంత ఎఫర్ట్ వృధా అయిపోతుందేమో అని భావిస్తున్నారు. అయితే.. 3డీ కూడా 2డీ రిలీజైన మరో వారం రోజుల తర్వాత విడుదల చేస్తారని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ సినిమా 2డితో పాటు 3డి రిలీజ్ కూడా ఉంటుందా.? లేదా.? అన్నది తెలియాలంటే డైరెక్టర్ గుణశేఖర్ పెదవి విప్పాల్సిందే!
ఇక ఈ చిత్రం టైటిల్ రోల్ లో అనుష్క శెట్టి కనిపిస్తుండగా.. చాళుక్య వీరభద్రుడిగా రానా దగ్గుబాటి, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ సినిమాను దాదాపు రూ.80 కోట్లకంటే ఎక్కువ వ్యయంతో గుణశేఖర్ నిర్మించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more