‘గోపాల గోపాల’ తర్వాత విక్టరీ వెంకటేష్ మరో సినిమాను ప్రారంభించలేదు. గతకొద్ది కాలంగా సరైన కథ కోసం ఎదురుచూస్తున్న వెంకటేష్ కు క్రాంతి మాధవ్ చెప్పిన కథ నచ్చడంతో ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’ చిత్రంతో భారీ హిట్టును సొంతం చేసుకున్న క్రాంతి మాధవ్ మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని యువ నిర్మాత పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నాడు. ఇందులో వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి ‘సంతోషమే సగం బలం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ఈనెల 15వ తేదిన ప్రారంభం కానుంది. గోపి సుందర్ సంగీతం, విఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫిని అందించనున్నాడు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more