‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, మరియు జయసుధ పోటీ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కు మద్ధతు పలుకుతూ ఇటీవలే నాగబాబు, శివాజీరాజా తదితరులు ఇటీవలే ఓ ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో రాజేంద్రప్రసాద్ కు మద్ధతు పలుకుతూ నాగబాబు, శివాజీరాజాలు పలు వ్యాఖ్యలు చేసారు.
అయితే తాజాగా జయసుధకు మద్ధతు పలుకుతూ ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఇందులో జయసుధకు మద్ధతు పలుకుతూ మురళీమోహన్, కృష్ణంరాజు, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, మంచు లక్ష్మీప్రసన్న, రఘుబాబు, హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నటుడు రాజేంద్రప్రసాద్ కు మద్దతు పలికిన నాగబాబు, శివాజీరాజాలు చేసిన కామెంట్లకు కౌంటర్ గా జయసుధ మద్ధతుదారులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో హేమ ఓ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ... ఇప్పుడు రాజేంద్రప్రసాద్ గారికి ఎవరైతే ఒకాయన సపోర్టింగ్ గా వున్నారో... ఆయన మాకు ఇదివరకే ప్రెసిడెంట్ గా చేసారండి. అలా చేసినపుడు మేము దిగిపోయి ఆయనకు హ్యండ్ వర్క్ చేసాం. ఆయన కూర్చొని ఓ ఇల్లు కొన్నారు. దాని ఖరీదు 75 లక్షలు. ఇపుడు దాని విలువ 15 లక్షలు. ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. కనీసం ఏదైనా చేసి ఫండ్ కూడా ఏర్పాటు చేయలేదు. వున్న డబ్బులను ఖర్చుపెట్టి, చక్కగా వెళ్లిపోయారు. మరి ఇపుడు ఏ విధంగా బిల్డింగ్ కొంటాను, అది చేస్తాను అంటూ అడుగుతున్నారు? మీరు వున్నప్పుడు ఏం చేసారు? ఒక్కసారి ఆలోచించండి. ఆ తర్వాత మాట్లాడండి! అంటూ చెప్పుకొచ్చింది.
హేమ చేసిన ఈ కామెంట్లు నాగబాబుపైనే అని తెలుస్తుంది. ప్రస్తుతం హేమ చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. మరి హేమ చేసిన కామెంట్లపై నాగబాబు ఎలా స్పందిస్తారో... ఈ ‘మా’ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయాలు జరుగనున్నాయో త్వరలోనే తెలియనున్నాయి.
Video Source from idlebrainlive
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more