ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రలలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్లో నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నాడు.
ఇటీవలే ఈ చిత్ర తెలుగు ముహూర్త కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ చిత్ర తమిళ ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. తాజాగా చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించారు. చెన్నయ్ లోని ఈసీఆర్ రోడ్డు సమీపంలో ఓ ప్రత్యేకమైన సెట్ కూడా ఏర్పాటు చేసారు.
మొదటి షెడ్యూల్ చెన్నయ్ లో జరిపి ఆ తర్వాత హైదరాబాద్, మరియు విదేశాలలో షూటింగ్ జరుపనున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more