ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు గురువారం (05-03-2015) జరిగాయి. ఈ కార్యక్రమానికి రాంచరణ్ తల్లితండ్రులు చిరంజీవి, సురేఖలతో పాటు చిత్ర దర్శకులు శ్రీనువైట్ల, నిర్మాత దానయ్య, మరియు రచయిత గోపిమోహన్, దర్శకులు వి.వి.వినాయక్ లు పాల్గొన్నారు.
ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య ‘డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకం’పై నిర్మించనున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయితలు కోనవెంకట్, గోపి మోహన్ లు కలిసి కథ, మాటలు అందిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. ఇక ఈ చిత్రానికి ‘కొలవెరి’ ఫేం అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. మార్చి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి, అక్టోబర్ 15న విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more