కమెడియన్, తండ్రి, విలన్ సహా ఇతర పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘ఆహుతి’ ప్రసాద్ గా చెరగని ముద్ర వేసిన ప్రసాద్ కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఆయన వైద్య సేవలు పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రసాద్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు అని అందరూ చెప్పారు.., తప్ప ఆయనకు ఏమయిది అని ఎవరూ చెప్పలేకపోయారు. కుటుంబ సభ్యులు కూడా నటుడికి ఏ ఇబ్బంది వచ్చిందో బయటకు చెప్పలేదు. దీనిపై వాకబు చేయగా అనారోగ్యంకు కారణం తెలిసింది.
ప్రసాద్ ను ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి పీడిస్తోందని పలువురు సన్నిహితులు తెలిపారు. ఈ విషయం ప్రశ్నించినా కుటుంబ సభ్యుల నుంచి సరైన సమాచారం రాలేదు. అయితే క్యాన్సర్ కు చికిత్స తీసుకునేందుకే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉండటంతో పాటు.., ప్రసాద్ ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఇది సంతోషించాల్సిన విషయం. కానీ.., మహమ్మారి వ్యాధి నుంచి ఆయన త్వరగా బయట పడాలని ‘తెలుగు విశేష్’ కోరుకుంటోంది. ప్రసాద్ ఆరోగ్యం గురించి తెలిసిన టాలీవుడ్ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. మంచి మనిషి త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు.
ప్రసాద్ కెరియర్ :
తెలుగు ఇండస్ర్టీలో అందరూ హీరోలే వస్తున్న తరణంలో ఉన్న కొద్ది మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఆహుతి ప్రసాద్ ఒకరు. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన్ వర ప్రసాద్. నాగార్జున హీరోగా నటించిన ‘విక్రమ్’ సినిమాతో ఇండస్ర్టీలోకి అడుగు పెట్టి అనేక క్యారెక్టర్లు చేశారు. ‘మల్లె మొగ్గలు’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. శ్యాం ప్రసాద్ రెడ్డి సినిమా ‘ఆహుతి’తో పాపులర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే సినిమాకు 2003లో ఉత్తమ విలన్ గా, ‘చందమామ’ సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. సినీ జీవితంలో దాదాపు 125 సినిమాల్లో ప్రసాద్ నటించారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more