తెలుగువాడైన విశాల్ తమిళ ఇండస్ర్టీలో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. తమిళనాడు సినిమా కళాకారుల అసోసియేషన్ ‘నడిగర్ సంఘం’లోని పలువురు వ్యక్తులపై విమర్శలు చేసినందుకు ఆయన్ను సంఘం నుంచి తొలగించారు. విశాల్ ను తొలగిస్తూ నడిగర్ సంఘం ప్రసిడెంట్ శరత్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శరత్ పై సీరియస్ కావటంతో పాటు... పలు ప్రశ్నలతో లేఖను సంధించారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు.
లేఖలో విశాల్ పేర్కొన్న అంశాలు.. ప్రశ్నలు ఇవి :
* సస్పెన్షన్ నిర్ణయంతో నేను షాకయ్యాను. నడిగర్ సంఘంలోని వ్యక్తులను గౌరవించే నన్ను ఎలా తొలగిస్తారు.
* నా తొలగింపుపై సంఘం ప్రసిడెంట్ గా మీరు (శరత్ కుమార్) చూపిన కారణాలు వాస్తవం కాదు.
* నాపై ఆరోపణలకు ఆధారాలు చూపండి. అప్పుడు మీరు చెప్పే కారణాలు నిజమని నమ్ముతాను.
* నడిగర్ సంఘంకు చెందిన రాధారవి, కె.ఎన్.కళై నటులపై అసభ్య పదజాలంతో దూషిస్తే అది మీకు కన్పించదు.
* నటులను ‘కుక్కలు’ అని అసభ్యంగా తిట్టినా వారిపై చర్యలు తీసుకోరు.
* రూల్ 13 ప్రకారం నటుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడే సంఘం సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నా వీరిపై ఎందుకు అమలు చేయరు?.
* ఇదే సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చిన నటుడు కుమారిముత్తును బయటకు పంపించారు.
* పదవులు, హోదాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం ఉండాలన్నదే నా కోరిక.
* కాబట్టి కళై, రాధారవిని కూడా నడిగర్ సంఘం నుంచి తొలగించాలని కోరుతున్నా.
ఇలా ఘాటు మాటలతో సూటిగా శరత్ ను ప్రశ్నిస్తూ తిరుచ్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లేఖను విడుదల చేశారు. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే.., తమిళ ఇండస్ర్టీలో మెయిన్ హీరోల్లో ఒకరిగా ఉన్న విశాల్, కొద్దికాలంగా నడిగర్ సంఘ వ్యవహారాలపై స్పందిస్తున్నాడు. ముఖ్యంగా రాధారవి వంటి వ్యక్తులపై చాలా సీరియస్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే విశాల్ పై ఆగ్రహంగా ఉన్న శరత్.., క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడారని ఆరోపిస్తూ విశాల్ ను తొలగించారు. ప్రస్తుతం కోలీవుడ్ లో జోరుగా నడుస్తున్న ఈ వివాదం ఎటు వెళ్తుందో.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more