చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చుకున్నప్పటి నుంచి వరుసగా పరాజయాలను ఎదుర్కుని ఐరెన్ లెగ్ పేరు తెచ్చుకున్న ‘‘శృతిహాసన్’’... ఇప్పుడు మెగాహీరోల మధ్య నలిగిపోతోంది. ఒక్క హిట్ కూడా దక్కని తరుణంలో పవన్ కల్యాణ్ పుణ్యమా అని ‘‘గబ్బర్ సింగ్’’ సినిమాతో ఈమె దశే తిరిగిపోయింది. ఆ సినిమా పెద్ద హిట్ అయిన తరువాత శృతి ఇక వెనుదిరిగి చూడలేదు. గబ్బర్ సింగ్ అనంతరం ఈమె నటించిన దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించాయి. దీంతో ఈమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.
ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ అమ్మడు మెగాకథానాయకులైన పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో ‘‘గబ్బర్ సింగ్, ఎవడు, రేసుగుర్రం’’ వంటి భారీ చిత్రాల్లో నటించింది. అవి ఆమె కెరీర్ లోనే ఘన విజయాన్ని సాధించిపెట్టాయి. ఇటీవలే ‘‘రేసుగుర్రం’’ సినిమా వందరోజుల ఫంక్షన్ కూడా జరుపుకుంది. దీంతో ఈ అమ్మడికి మెగా హీరోయిన్ అని పేరు వచ్చేసింది. మెగాహీరోల వల్లే తన దశ తిరిగిపోయిందని తెలుసుకున్న ఆ హాట్ భామ... వారి సరసన నటించే అవకాశాలు వస్తే వాటిని వదులుకోకూడదని భావిస్తోందని సమాచారం.
ఎందుకంటే.. తాజాగా ఈ అమ్మడు రామ్ చరణ్ సరసన నటించడానికి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్ లలో ఫుల్ బిజీగా వుంది. క్షణం తీరిక లేకుండా అటు నుంచి ఇటు షూటింగులలో తిరుగుతూనే వుంది. పైగా తెలుగులోనూ కొన్ని ప్రాజెక్టులకు సంతకాలు కూడా చేసేసింది. ఇంతటి బిజీ సిట్యుయేషన్ లో కూడా శృతి తన కాల్షీట్లను సద్దుబాటు చేసుకుని మరీ రామ్ చరణ్ తో నటించడానికి ఓకే చెప్పేసిందట!
రామ్ చరణ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! అయితే ఇందులో హీరోయిన్ ఎవర్ని తీసుకోవాలా అని వేట మొదలుపెట్టి, చివరికీ శృతిహాసన్ ని సంప్రదించారట! దాంతో ఈ అమ్మడు క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం! ‘‘ఎవడు’’ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్న ఈ జంట... తమ తదుపరి సినిమాలో బాగానే రొమాన్స్ పండించడానికి సిద్ధమవుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more