అల్లు అర్జున్ గెస్ట్ రోల్ పోషించిన ‘ఎవడు ’ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఇప్పుడు తన సొంత సినిమా ‘రేసు గుర్రం ’ పై ద్రుష్టి సారించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట సంక్రాంతి రేసులో నిలపాలని చూసినా, చరణ్, తను కలిసి నటించిన ‘ఎవడు ’ సినిమా అప్పుడే విడుదల అవుతుంది కాబట్టి థియేటర్స్ ప్రాబ్లమ్స్ తో రేసునుండి తప్పుకున్న ఈ సినిమా ను ఏప్రిల్ నాల్గవ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగు ఓ పాట మినహా మొత్తం పూర్తయ్యింది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా, సలోని సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టుకుంది. ఫిబ్రవరి 15 తేదీ నుండి చివరి పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్న తరువాత ఆడియో తేదీని ప్రకటించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో భోజ్ పురి నటుడు రవి కిషన్ ఇందులో ప్రధాన విలన్ పాత్రను పోషిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more