నిర్మోహమాటంగా తన జీవిత విశేషాలను చెప్పగలిగే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన తాజా సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ సినిమా రేపు (గురువారం) నాడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న 25వ సినిమా కావడం విశేషం. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ అనేక విషయాలను మీడియాతో పంచుకున్నారు. నేను తొలిసినిమా బద్రి చేస్తున్నప్పుడు ఆ మూవీ నిర్మాత నువ్వు 25 సినిమాలు పూర్తిచేస్తావని ఆనాడే చెప్పారని అయితే. నేడు ఉన్న స్థాయిలో ఉంటానని తాను ఏనాడు ఉహించుకోలేదని పూరీ జగన్నాథ్ తెలిపారు. ఎనిమిదో తరగతి నుంచే కథలు రాయడం మొదలు పెట్టానని చెప్పారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కృష్ణానగర్ లో అద్దె కట్టడానికి కూడా ఇబ్బందులు పడే వాడినని గుర్తు చేసుకున్నారు. తన కొత్త సినిమా ‘రాంబాబు’ గురించి కూడా పూరీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఈ రాంబాబు సినిమాలో కనిపిస్తుందని పూరీ అన్నారు. మహేష్ బాబు నీకు నచ్చిన చిత్రం తీయమన్నాడనీ, కానీ పవన్ కళ్యాణ్ బాధ్యత ఉన్న సినిమా తీయమన్నాడని పూరీ జగన్నాథ్ తెలిపారు. రిపోర్టర్ రాంబాబుకు, పొలిటీషియన్ ప్రకాష్ రాజ్ కు మధ్య జరిగే గొడవ తాలూకు కథతోనే కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం సాగుతుందని, ముగింపు దృశ్యాలు సరికొత్తగా ఉంటాయని పూరీ తెలిపారు. ప్రీ క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ చెప్పే నాలుగు నిమిషాల డైలాగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని ఆయన తెలిపారు. కెమెరామెన్ గంగ మగ రాయుడిలా కనిపించే టామ్ బాయ్ హీరోయిన్ అని చెప్పారు. తమన్నాకు ఈ పాత్ర సరికొత్తగా ఉంటుందని పూరీ జగన్నాథ్ తెలిపాడు.
కాగా, ‘కెమెరా మేన్ గంగతో రాంబాబు’ రిలీజ్ కి రంగం సిద్ధమైంది. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులు రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని ఎంతో ధీమాతో ఉన్నారు. ఎందుకంటే... వాళ్లకో సెంటిమెంట్ ఉందని చెబుతున్నారు. అదేంటంటే... గతంలో పవన్ కల్యాణ్ ఓ జర్నలిస్టు పాత్రలో ‘బంగారం’లో నటించాడు. ఆ చిత్రం బీ,సీ సెంటర్లలో ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు పవన్ మళ్లీ జర్నలిస్టు అవతారం ఎత్తాడు. కాబట్టి పవన్ కి జర్నలిస్టు పాత్ర కలిసొచ్చిందనీ... పైగా బద్రీ తరువాత పూరీ జగన్నాథ్ - పవన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ మరోసారి వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ ఆశలు ఫలించాలని మనమూ ఆశిద్దాం... ఏమంటారు..
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more