మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ మధ్యన బిజీ బిజీ షెడ్యూలు ఫిక్స్ చేసుకున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న ‘రచ్చ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ వెంటనే వి.వి.వినాయక్ డైరెక్షన్ లో ‘ఎవడు’ అనే టైటిల్ తో ఓ సినిమా ప్రారంభించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా క్యూట్ గాళ్ సమంత నటిస్తుంది.
అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా పై ఓ గాలి వార్త ఫిలింనగర్ లో సంచరిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్ చేయబోతున్నాడని అనుకుంటారు. ఈ పాత్రలలో రామ్ చరణ్ ఒకదానికిలో క్లాస్, ఒక దానిలో మాస్ గా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ చిత్రం చిరంజీవి గత చిత్రాలైన దొంగ మొగుడు, రౌడీ అల్లుడు నుంచి ప్రేరణ పొందే తీస్తున్నారని కూడా చెప్పుకుంటున్నరు. మరి అసలే ఫ్లాపులతో ఉన్న వి.వి.వినాయక్, చరణ్ లు ఈ సినిమాలో ప్రయోగాలు చేస్తున్నారని అంటున్నారు. మరి ‘ఎవడు’ ఈ సినిమా ఎప్పుడు వచ్చింది అన్నట్లుగా ఉంటుందో లేక, ఈ సినిమాలో హీరో ‘ఎవడు’ అని చెప్పుకునే విధంగా ఉంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more