తెలుగు చలనచిత్ర రంగంలో పేరుగాంచిన ప్రముఖ హాస్యనటుల్లో కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు ఒకరు. 200కు పైగా సినిమాల్లో నటించిన ఈయన.. తన హాస్య ప్రతిభతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ప్రతిఒక్కరి మదిలో చెరగని చిరకాల గుర్తింపును ముద్రించారు. ‘సుత్తివేలు’గా ప్రఖ్యాతిగాంచిన ఈయనకు ఆ పేరు రావడం వెనుక ఓ కథ వుంది. ఈయన తన చిన్నతనంలో చాలా సన్నగా వుండేవాడు. దాంతో ఈయన పక్కింటి పిన్ని ‘వేలు’ అని పిలిచేది. ఇక ‘నాలుగు స్తంభాలాట’ చిత్రంలో ఈయన నటించిన పాత్ర పేరు ‘సుత్తి’. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో అందరూ ‘సుత్తివేలు’ అని పిలవడం ప్రారంభించారు.
జీవిత విశేషాలు :
1947 ఆగస్టు 7వ తేదీన కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలంలోని భోగిరెడ్డిపల్లిలో ఈయన జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి వుండేది. 1966లో పి.యు.సి చదివిన అనంతరం, హైదరాబాదుకు చేరుకుని అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవారు. 1967లో ఉద్యోగం మారి బాపట్ల చేరుకున్నారు. అయితే.. ఈయనకు నాటకాలంటే ఎక్కువ మక్కువ వుండటం వల్ల తాను చేస్తున్న ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవారు. ఈ క్రమంలోనే 1981లో విశాఖ డాక్ యార్డులో శాశ్వత ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చారు. అదే ఆయన జీవితంలో మలుపు తిప్పింది.
అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఈయన నాటకాల్లో నటించడం మానేయలేదు. ఆ సమయంలో ‘మనిషి నూతిలో పడితే’ అనే నాటకంలో ఈయన ఓ ప్రత్యేక పాత్రలో నటించాడు. అప్పుడు ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ జంధ్యాల తన చిత్రం ‘ముద్ద మందారం’లో రిసెప్షనిష్టుగా చిన్న పాత్రను ఇచ్చాడు. ఇలా 1981లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. ఇక అక్కడి నుంచి సుత్తివేలు ఏమాత్రం వెనక్కి తిరిగిచూడలేదు. ఆ సినిమా అనంతరం జంధ్యాల తన వరుస చిత్రాలైన ‘మల్లె పందిరి, నాలుగు స్తంభాలాట’లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చారు. ఆనంద భైరవి, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించారు.
త్రిశూలం చిత్రం తర్వాత ఈయన అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. అయితే.. ఆ తర్వాత మళ్లీ ఈయనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అప్పటివరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు, అనంతరం తన నటనలోని మరో పార్శ్వాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. వందేమాతరం, ప్రతిఘటన, కలికాలం, ఒసేయ్ రాములమ్మ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. వందేమాతరం చిత్రానికిగాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.
వ్యక్తిగత జీవితం :
ఈయన తన స్థిరనివాసం మద్రాసులో ఏర్పరుచుకున్నారు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలడంతో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయారు. దీనితో పలు టెలివిజన్ ధారావాహికలలో నటించారు. చివరి రోజులలో తన మకాంను హైదరాబాదుకు మార్చారు. ఈయన వివాహము లక్ష్మీరాజ్యంతో జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానము. ఈయన 2012 సెప్టెంబర్ 6వ తేదీన తుదిశ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more