సుప్రసిద్ధ కథానాయకులుగా పేరొందిన నటులలో ‘‘ఎస్వీ రంగారావు’’ ఒకరు! మూడు దశాబ్దాలపాటు 300 చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి, ‘‘నట యశస్వి’’గా పేరొందారు. ముఖ్యంగా ఆయన ఆధ్యాత్మిక సంబంధించి చిత్రాల్లోనే ఎక్కువగా నటించారు. ఆనాడు ఆయన నటించిన ఘటోత్కచుడు, కీచకుడు, రావణాసురుడు వంటి పాత్రలు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. మొత్తం సినిమాల్లో ఆయన నటించిన పాత్రల్లో ఎంతవరకు మమేకమయ్యేవారంటే.. వేరెవరు కూడా ఆ పాత్రల్లో ఇప్పటివరకు ఇమడలేకపోయారు. ఈయనకు కేవలం నట యశ్వసియే కాదు.. నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి అనే బిరుదులు కూడా వున్నాయి.
జీవిత విశేషాలు :
1918 జూలై 3వ తేదీన కృష్ణా జిల్లాలోని నూజివీడులో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడు దంపతులకు ఎస్వీ రంగారావు జన్మించారు. ప్రాథమిక పాఠశాల విద్యానంతరం హిందూ కాలేజీలో డిగ్రీ వరకు చదివారు. తర్వాత అగ్నిమాపక దళంలో ఉన్నత ఉద్యోగిగా పనిచేశారు. ఆ ఉద్యోగ సమయంలోనే ఆయన షేక్స్’పియర్ ఆంగ్ల నాటకాల్లో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి.. ప్రముఖ రంగస్థల కళాకారుడిగా పేరుగాంచారు. ఆ తర్వాత ఆయన దర్శకుడు బి.వి.రామానందం నిర్మించిన ‘‘వరూధిని’’ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా చిత్రపరిశ్రమ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
సినీ జీవితం :
‘‘వరూధిని’’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రంగారావు.. తర్వాత ‘‘మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు’’ వంటి అనేక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి, తన నటనాచాతుర్యంతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన నటించిన పాత్రలు ఎంతో వైవిధ్యమైనవి కాబట్టి.. ఆయనలా ఎవరూ నటించలేకపోయేవారు. దాంతో ఆయనకు ‘‘నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి’’ మొదలైన బిరుదులతో ప్రేక్షకులు గౌరవించారు.
రంగరావు నటించిన నర్తనశాల చిత్రం ఇండోనేషియాలోని జకార్తా ఫ్రో-ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవములో ప్రదర్శించబడటమే కాకుండా కీచకపాత్రకు భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు. ఈయన కేవలం నటనలోనే కాదు.. దర్శకత్వ రంగంలోనూ తన ప్రతిభను నిరూపించుకోగలిగారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన ‘‘చదరంగం’’ చిత్రం అద్భుత విజయం సాధించడంతోబాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
వ్యక్తిగత జీవితం :
వ్యక్తిగా రంగారావు సహృదయుడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు. ఆయన ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయన ఒక రకమైన వేదాంతి కూడా! ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. అంతేకాదు.. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చిన గొప్పదాత.
చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే పాకిస్తాన్తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శలు చేసి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి అందించారాయన! ఇలా ప్రజాసేవకు తనదైన సహాయాన్ని అందించి, అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసులో శాశ్వతంగా కన్నుమూశారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more