బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశస్వాతంత్య్రంకోసం పోరాడిన సమయోధుల్లో ‘‘బాబూ రాజేంద్ర ప్రసాద్’’ ఒకరు. స్వాతంత్ర్య సమరంలో భాగంగా నిర్వహించిన ఎన్నో ఉద్యమాల్లో, నినాదాల్లో ఈయన ప్రత్యేకపాత్రను పోషించాడు. స్వాతంత్ర్యంపట్ల ప్రజల్లో చైతన్యం కల్పించిన ఈయన.. ఒక ముఖ్యనాయకుడిగా ఎదిగాడు. ఈయన నాయకత్వాన్ని మెచ్చుకున్న ప్రజలు ప్రేమగా ‘బాబు’ అని పిలుచుకునేవారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా గొప్ప పేరు సాధించిన ఈయన.. భారత రాజ్యాంగంలోనూ కీలకపాత్రను పోషించారు. దేశపు మొదటి ప్రభుత్వంలో కొన్నాళ్లపాటు కేంద్రమంత్రిగా కొనసాగిన ఈయన.. మొట్టమొదటి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
జీవిత విశేషాలు :
1884 డిసెంబరు 3వ తేదీన బీహార్ రాష్ట్రం, శివాన్ జిల్లాలోని జిర్దేయి గ్రామంలో మహదేవ్ సహాయ్ - కమలేశ్వరీ దేవి దంపతులకు జన్మించారు. ఐదవ ఏటలో పర్షియన్ భాష నేర్చుకున్న ఈయన.. ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తిచేశాడు. 12 ఏటలోనే రాజ్వంశీ దేవీతో వివాహం జరిగింది. అనంతరం పాట్నాలో ఉన్నత విద్యను అభ్యసించారు. కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అప్పుడే ఆయన కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు.
మొదట సైన్యు విద్యార్థిగా కొనసాగిన ఈయన.. తర్వాత సాంఘికశాస్త్రంపై మక్కువ పెంచుకున్నారు. ఆర్థికశాస్త్రంలో ఎం.ఎ. చదివిన అనంతరం, బి.ఎల్. ఆ తర్వాత ఎం.ఎల్. పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందాడు. ఆయన చదువుతున్నకాలంలో తన అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్నీ నడిపాడు. దాంతో ఆయన 1911లో కాంగ్రెసులో చేరాడు. ఆ సమయంలో స్వాతంత్ర్య సమరంలో పాల్గొనేందుకు ఆయన ప్రత్నించాడు కానీ.. అప్పుడు కుటుంబపరిస్థితులు బాగులేకపోవడం వల్ల 1916లో బీహార్, ఒరిస్సా రాష్ట్రాల హైకోర్టులలో న్యాయవాదిగా చేరాడు.
స్వాతంత్ర్య సమరంలో బాబూ పాత్ర :
న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. కొన్నికాలాలకే స్వాతంత్ర్యం పోరాటంవైపు ఆకర్షితుడయ్యాడు. 1921లో మహాత్మా గాంధీతో ఒకసారి సమావేశం జరిగిన తర్వాత ఆయన విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశాడు. పాశ్చాత్య చదువులను బహిష్కరించమని గాంధీజీ పిలుపునిచ్చినపుడు తన కుమారుడు మృత్యుంజయ ప్రసాదును విశ్వవిద్యాలయ చదువు మానిపించి వెంటనే బీహార్ విద్యాపీఠ్లో చేర్చాడు. 1924లో బీహారు, బెంగాల్లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అభాగ్యులను తనవంతు సహాయాన్ని అందించాడు. అలాగే 1934 జనవరి 15వ తేదీన బీహార్’లో భూకంపం వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన జైలులో వున్నాడు. విడుదలైన అనంతరం బాధితులకోసం ఆయన నిధులు సేకరించగా.. భారీస్థాయిలో ముట్టాయి.
1934 అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు బాబూ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అలాగే 1939, 1947లో కూడా ఆ పదవిలో కొనసాగారు. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన్ను రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. అలా పదవీబాధ్యతలు చేపట్టిన ఆయన.. రాజ్యాంగ నిర్మాణంలో ప్రధానినిగానీ, పార్టీనిగానీ జోక్యం చేసుకోనివ్వలేదు. 12 సంవత్సరాలపాటు రాష్ట్రపతిగా సేవలందించిన ఆయన.. 1962న పదవీ విరమణ చేసాడు. హిందీ, సంస్కృతం, ఉర్దూ,పర్షియన్, ఇంగ్లీషు భాషల్లో పండితుడైన బాబూ.. ‘హిస్టరీ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ, ఇండియా డివైడెడ్, ఆత్మకథ, ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా’ వంటి గ్రంథాలను రచించారు.
పదవీ విరమణ తర్వాత కొన్ని నెలలకు ఆయన భార్య రాజ్వంశీ దేవి చనిపోయింది. అనంతరం ఆయన కూడా 1963 ఫిబ్రవరి 28న కన్నుమూశాడు. ఆనాడు ఆయన అందించిన సేవలకుగానూ ప్రజలు అభిమానంతో ‘దేశ్ రత్న’ అని పిలిచేవారు. అలాగే అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని ఆనాటి ప్రభుత్వం ఆయనకు ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more