ఆనాడు బ్రిటీష్ పరిపాలనాకాలంలో భారతదేశ స్వాతంత్ర్యసమర పోరాటాల్లో పాల్గొన్న ఎందరో ప్రముఖుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు! అంతేకాదు.. స్వాతంత్ర్యానంతరం ఎన్నో సంస్థానాలను భారతదేశంలో విలీనం కావడానికి కృష్టిచేసి.. ప్రముఖుడిగా పేరొందారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలు దేశంలో విలీనం చేసిన ఘనత ఈయనదే! ఇంగ్లాండులో బారిష్టరు పట్టాపొందిన అనంతరం దేశానికి తిరిగివచ్చిన సమయంలో ఇక్కడ జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై మహాత్మాగాంధీ నేతృత్వంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నారు. అలాగే దేశప్రజల సంక్షేమంకోసం ఎన్నో సాంఘిక ఉద్యమాలను చేపట్టారు. రాజకీయరంగంలోనూ ఎన్నో పదవులను చేపట్టారు. దేశవిభజన అనంతరం జరిగిన అల్లర్లను అణిచివేయడంలో తన చాకచక్యాన్ని చాటుకున్నారు. అందుకే ఈయనను ‘‘భారతదేశపు ఉక్కుమనిషి’’గా పేర్కొంటారు.
జీవిత చరిత్ర :
1875 అక్టోబర్ 31న గుజరాత్లోని నాడియాడ్ లో నివాసమున్న జవేరీ భాయి - లాడ్లా పటేల్లకు వల్లభభాయి పటేల్ నాల్గవ సంతానంగా జన్మించారు. స్థానికంగానే ప్రాథమిక విద్యాభ్యాసాన్నిపూర్తిచేసిన పటేల్.. ఉన్నతన్యాయశాస్ట్ర చదువులకోసం ఇంగ్లాండుకెళ్లి బారిష్టర్ పట్టాపొందారు. అనంతరం దేశానికి తిరిగొచ్చిన తర్వాత అహ్మదాబాద్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. తర్వాత ఝవెర్బాను పెళ్లాడిన ఆయన.. ఆ దంపతులకు కుమార్తె మణిబెన్, కుమారుడు దహ్యాభాయ్ జన్మించారు. 1909లో ఆయన భార్య క్యాన్సర్ వ్యాధితో మరణించింది. అయితే ఈయన రెండో పెళ్లి చేసుకోకుండా పిల్లలను పెద్దవాళ్లను చేశారు.
ఇతర విశేషాలు :
ఇంగ్లాండులో బారిష్టర్ పట్టాపొందిన అనంతరం దేశానికి తిరిగొచ్చిన ఆయన.. ఇక్కడ జరుగుతున్న భారత జాతీయోద్యమానికి ఆకర్షితుడై... గాంధీజి చేపట్టిన సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ‘‘బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం’’ విధించిన పన్నులకు వ్యతిరేకంగా 1928లో బార్దోలీలో ‘‘కిసాన్ ఉద్యమం’’ను చేపట్టి విజయవంతంగా నడిపించారు. అప్పుడే ఆయనకు ‘‘సర్దార్’’ అనే పేరొచ్చింది. గాంధీ చేపట్టిన సహాయనిరాకరణోద్యమంలో పాల్గొని, దాదాపు 3, 00000 మంది సభ్యులతో కలిసి రూ.15 లక్షల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తాను ఎంతోమోజుగా వేసుకునే తెల్లదొరల బట్టలను అగ్నికి ఆహుతి చేశారు. గుజరాత్ లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేశారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో ప్రముఖపాత్ర వహించారు.
ఆనాడు రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా మంచి సహకారాన్ని అందించారు. ప్రాథమిక హక్కుల కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. 1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లోఇండియన్ లాకు నామినేట్ చేయు విధానాన్ని ఆయనే ప్రతిపాదించారు. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను, ఉపప్రధానమంత్రిగాను పదవులను చేపట్టారు. అయితే ఉపప్రధానమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో 1950 డిసెంబర్ 15న మరణించారు. అయితే ఆ పదవిలో కేవలం 40 మాసాలు మాత్రమే వున్న ఆయన.. దేశసమస్యలను తనదైన పద్ధతిలో పరిష్కరించారు. కానీ ముస్లింల పట్ల ఈయన వివక్షకు పాల్పడ్డారంటూ ఎందరో జాతీయవాదులు సైతం విమర్శించారు. కానీ దేశప్రజలను ఆకట్టుకోవడంలో ఈయన కీలకపాత్రను పోషించారు. ఈయన అందించిన సేవలకుగానూ భారతప్రభుత్వం 1991లో ‘‘బారతరత్న’’ బిరుదును ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more