ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఉన్నారు. కానీ తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి టేబుల్ ఫ్రాఫిట్ 22 లక్షలు తెచ్చి పెట్టిన ఓ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడంటే మీకు నమ్మశక్యంగా ఉందా ? కానీ నమ్మాలి. ఓ కొత్త డైరెక్టరుగా, అందరు కొత్త వాళ్లతో, 5డి కెమెరాతో సినిమా తీసి అందరి చేత ‘‘ఈ రోజుల్లో’’ ప్రశంసలు అందుకుంటున్న న్యూ డైరెక్టర్ మారుతి దాసరి. అతని సక్సెస్ వెనుక రహస్యం, అతని గురించి ఓసారి తెలుసుకుందాం.
దాసరి మారుతి మచిలీపట్నానికి చెందిన వాడు. తన బాల్యం, చదువు అంతా మచిలీపట్నంలోనే సాగింది. డిగ్రీ వరకు చదివిన మారుతి... చుదువుకునే రోజుల్లో నెంబర్ ప్లేట్స్ మరియు సైన్ బోర్డ్స్ లాంటి వర్స్ చేస్తుండేవాడు, తన చదువు పూర్తయిన తరువాత ఆర్థికంగా ఎదగాలనే ఉద్ధేశ్యంతో మచిలీపట్నం నుండి హైదరాబాద్ కి వచ్చి ఓ యానిమేషన్ సంస్థలో కొన్నాళ్ళు జాబ్ చేశాడు. యానిమేషన్ డైరక్టర్గా పనిచేస్తున్నప్పుడు బన్నితో పరిచయం కలిగింది. అప్పటి నుంచి సినిమాల పట్ల ఆసక్తి మొదలైంది. బన్నీవాసుతో కలిసి కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు. 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'ప్రేమిస్తే' చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ప్రారంభించే సయంలో అతనికి ప్రజారాజ్యానికి చెందిన యాడ్ ఫిలిం తీసిన కొద్ది పాటి అనుభవం తప్పితే... అతను ఇండస్ట్రీలో ఎవరి దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు. అలాంటి మారుతి డైరెక్ట్ గా సినిమా తీసి సంచలనం కలిగించాడు. పెద్ద డైరెక్టర్లకు కనువిప్పు కలిగించాడు.
దాసరి మారుతి తీసిన ‘ఈ రోజుల్లో’ పెద్ద హిట్ గా నిలవడంతో ప్రముఖులు అతని పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అయితే ఏకంగా మారుతిని ఆకానికి ఎత్తేశాడు. రామ్ గోపాల్ వర్మ మారుతి గురించి పోస్ట్ చేస్తూ... నేను 5డి కెమెరాతో పెద్ద స్టార్స్ ని పెట్టి ‘దొంగల ముఠా’ తీశాను. అది పెద్దగా ఆడలేదు. కానీ నేను సాధించలేనిది, నీవు 5డి కెమెరాతో సినిమా తీసి, అది కొత్త వాళ్లతో తీసి సాధించావు’ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు.
మరి పెద్ద బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే డైరెక్టర్లు ఇకనైనా దాసరి మారుతి ని చూసి నేర్చుకుంటారో లేదో కానీ, ఇతడు మాత్రం ఈ సినీ పరిస్థితిలో మార్పు రావాలి. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఉండాలి. నేను భవిష్యత్తులో ఏ హీరోతో పనిచేసినా అతని మార్కెట్ ఎంతుంటే అంతకుపైసా తక్కువగానే ఖర్చుపెడతాను. కథలను నమ్ముకుంటాను'' అని అంటున్నాడు. భవిష్యత్తులోను తీసే సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉండాలనేదే నా లక్ష్యమని చెబుతున్న ఈయన కల నెరవేరాలని ఆకాంక్షిస్తూ మరిన్ని మంచి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందియాలని కోరుకుందాం. ఇతని తదుపరి చిత్రం "బెల్లంకొండ సురేష్ సంస్థలో నితిన్ హీరోగా తీయబోతున్నాడు. ఇది కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఆంధ్ర విశేష్ ఆల్ ది బెస్ట్ చెబుతుంది.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more