భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది ఫాలో అవుతున్న విదేశాంగ శాఖ మంత్రులలో ఆమె ప్రధమ స్థానాన్ని అక్రమించారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వీట్టర్లో అత్యధిక మంది అనుసరిస్తున్న విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్ రికార్డు సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా ట్వీట్టర్లో ఎక్కువ మంది అనుసరిస్తున్న ప్రధాన మంత్రుల్లో భారత దేశ ప్రధాని నరేంద్రమోడీ మూడవ స్థానం అక్రమించారు. మహా దిగ్గజాలను వెనక్కు తోసి ప్రపంచస్థాయి నేతగా ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్ల తర్వాతి స్థానంలో ఉన్న మోదీని ట్వీట్టర్లో 83.9 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మాత్రం అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 17, 37,804 మంది అనుసరిస్తుండటంతో ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. యూఏఈ విదేశాంగ మంత్రి జాయేద్ 13, 80,574 మందితో రెండవస్థానంలో, వెనెజులా విదేశాంగ మంత్రి జువా మిరాండా 7,58,198 మందితో మూడవ స్థానంలో నిలిచారు. నవంబరు చివరినాటికి ఉన్న ఫాలో అయ్యేవారి సంఖ్య ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్లు ట్వీటర్ వెల్లడించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more