ర్యాగింగ్ భూతం మళ్ళి పడగవిప్పింది. విశాఖలో ఓ ఫార్మసీ విద్యార్థిని బలితీసుకుంది. మృతుడి బంధువుల సమాచారం ప్రకారం.., విశాఖలోని ఎన్.ఆర్..ఐ. కాలేజీలో ఫార్మసీ చదువుతున్న ప్రశాంత్ అనే విద్యార్థి నాలుగు రోజుల క్రితం కాలేజి బిల్డింగ్ పై నుంచి దూకాడు. తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని వెంటనే కేజీహెచ్ కు తరలించి చికిత్స అందించారు. గత రాత్రి ప్రశాంత్ మృతి చెందాడు. కేవలం సీనియర్ల ర్యాగింగ్ వల్లే విద్యార్థి చనిపోయాడని మృతుడి తల్లితండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
అయితే కాలేజీ యాజమాన్యం వాదన మరోలా ఉంది. ఎన్.ఆర్.ఐ. కాలేజీలో ర్యాగింగ్ లేదని మేనేజ్ మెంట్ వివరణ ఇస్తోంది. అంతేకాకుండా విద్యార్థి ర్యాగింగ్ వల్ల చనిపోలేదని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా కాలేజీ వర్గాల వాదనపై అనుమానాలు వస్తున్నాయి. వాస్తవానికి ఎన్.ఆర్.ఐ. కాలేజీ మెడిసిన్ కోర్సు అందిస్తోంది. వీరి ఆద్వర్యంలో భోధనాసుపత్రి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థి తీవ్రగాయాల పాలైతే సొంత ఆస్పత్రిలో చికిత్స అందించకుండా కేజీహెచ్ కు తరలించారు.
మరోవైపు శుక్రవారం రాత్రి విద్యార్థి తల్లితండ్రులతో కేజీహెచ్ నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు సంతకం చేయించుకుని.., సమీపంలో ఉన్న కేర్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న రెండు గంటల్లోనే ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ అర్ధంకాని విషయాలేమంటే.., సొంత ఆస్పత్రి ఉండగా కేజీహెచ్ కు ఎందుకు తరలించారు ?, కేజీహెచ్ నుంచి మళ్ళీ కేర్ కు ఎందుకు బలవంతంగా తీసుకెళ్ళారు? అనే విషయాలపై వివరణ ఇచ్చేందుకు మాత్రం కాలేజీ యాజమాన్యం ముందుకు రావటం లేదు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more