Center orders npr uidai to complete aadhar cards by next march

AAdhaar cards, centre, narendra modi, order, NPR, UIDAI, march 2015

center orders NPR, UIDAI to complete Aadhar cards by next march

ఆధార్ కార్డుల పంఫిణీని మార్చి లోపు పూర్తి చేయండి..

Posted: 11/07/2014 12:59 PM IST
Center orders npr uidai to complete aadhar cards by next march

దేశంలోని ప్రజలందరికీ వచ్చే ఏడాది మార్చిలోగా ఆధార్ సంఖ్య కేటాయింపును, వివరాల నమోదును పూర్తిచేయాలంటూ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ), జాతీయ జనాభా నమోదు సంస్థ(ఎన్‌పీఆర్)లను కేంద్రం ఆదేశించింది. ఈ ప్రాజెక్టు సమీక్షా సమావేశంలో ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు. యూఐడీఏఐ ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 70 కోట్ల మందికి ఆధార్ సంఖ్యను కేటాయించింది. వివిధ సాంఘిక సంక్షేమ పథకాలకు ఆధార్ సంఖ్యను వినియోగించటాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇందుకోసం మొత్తం జనాభా ఆధార్ సంఖ్య నమోదు ప్రక్రియను వచ్చే మార్చి కల్లా పూర్తి చేయాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఐ)ను, జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్)ను ఆదేశించింది. గత నెలలో జరిగిన ఆధార్ ప్రాజెక్ట్ సమీక్ష సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ఆదేశించిందని అధికార వర్గాలు తెలిపాయి. యూఐడీఏఐ ఇప్పటికే దేశవ్యాప్తంగా 70కోట్ల ఆధార్ సంఖ్యలను జారీచేసింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తయ్యిందని యూఐడీఏఐ ఈ సందర్భంగా తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAdhaar cards  centre  narendra modi  order  NPR  UIDAI  march 2015  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more