తెలంగాణలో నెలకొన్న విద్యుత్ లోటు త్వరలోనే తీరనుంది. రాష్ర్టానికి విద్యుత్ ఇచ్చేందుకు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఈ మేరకు రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు విద్యుత్ ఒప్పందంపై ఇవాళ సంతకం చేయనున్నారు. కొరతలు నివారించేందుకు రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్.., ఛత్తీస్ గఢ్ వెళ్ళి ఆ రాష్ర్ట ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ఆదివారం జరిగిన చర్చల్లో రాష్ర్టంలో ఉన్న విద్యుత్ సమస్య, తెలంగాణకు అవసరమైన విద్యుత్ పై రమణ్ సింగ్ కు వివరించారు.
దీంతో స్పందించిన ఛత్తీస్ గఢ్ సర్కారు తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ అమ్మేందుకు అంగీకరించింది. ఈ విద్యత్ వస్తే తెలంగాణలో ఉన్న తీవ్ర విద్యుత్ కొరతలు తీరతాయి అని చెప్పవచ్చు. తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవటంతో.., రాష్ర్టంలో కొరతలు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఛత్తీస్ గఢ్ కు వెళ్ళారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more