14 killed in himachal pradesh chamba district as bus rolls down gorge

14 killed, road accident, himachal pradesh, chamba district, bus rolls down gorge, 12 injured

14 killed in himachal pradesh chamba district as bus rolls down gorge

హిమాచల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి..

Posted: 11/02/2014 01:17 PM IST
14 killed in himachal pradesh chamba district as bus rolls down gorge

హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభివించింది. చంబా జిల్లాలో మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చంబా పట్టణం నుంచి హిమగిరికి ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోని అధిక వేగంతో బస్సును నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై సీఎం వీరభద్ర సింగ్, గవర్నర్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సహయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకోవడం, అధిక వేగంతో ప్రయాణించడంతో హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఏడాది దాదాపు 1000 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో 556 ప్రదేశాలలో ప్రమాదాలు అధికంగా జరుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 14 killed  road accident  himachal pradesh  chamba district  bus rolls down gorge  12 injured  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more