Tdp leaders to join trs today at a meeting in teegala collage in presence of cm kcr

TDP, MLA's, MLC, TRS, TKR collage, Telangana CM KCR, talasani srinivas yadav, Teegala KrishnaReddy, gangadhar goud, parakala Mla dharmareddy, KCR

TDP leaders to join TRS today at a meeting in teegala collage in presence of CM KCR

టీఆర్ఎస్ లో ఇవాళ లాంఛనంగా చేరనున్న తెలుగుతమ్ముళ్లు..

Posted: 10/29/2014 07:42 AM IST
Tdp leaders to join trs today at a meeting in teegala collage in presence of cm kcr

టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలలతో పాటు ఎమ్మెల్సీ గంగారెడ్డి కూడా ఇవాళ లాంఛనంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మహేశ్వరం ఎమె్మల్యే తీగల కృష్ణారెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. టీకేఆర్ కళాశాల ఆవరణలో సాయంత్రం  జరుగనున్న ఓ కార్యక్రమంలో వారు అధికారికంగా టీఆర్ఎస్ లోకి చేరనున్నారు.

ఈ మేరకు నలుగురు నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసి చర్చలు జరిపారు. నిజాం కాలేజ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించి పార్టీలో చేరుతానని తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పినప్పటికీ, సీఎం సూచన మేరకు ఇవాళే గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించారు. కాగా, గ్రేటర్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో  ఉన్న తలసాని, తీగల సహచర టీడీపీ నాయకులు కూడా కేసీఆర్ సమక్షంలో పార్టీ మారుతున్నట్టు సమాచారం. మరోవైపు పార్టీ మారేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి అనుమతి పొందిన మరో ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా త్వరలో టీడీపీ పార్టీని వీడనున్నారు. వరంగల్ జిల్లా పరకాలలో ఏర్పాటు చేసే సభ ద్వారా ఆయన పార్టీ మారనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more