Two little girl kids of 7 years old kidnapped in chittoor

girl kids, 7 years old, missing, kidnap, lavanya, sangeetha, complaint, challavaripalli, chittoor district

Two little girl kids of 7 years old kidnapped in chittoor

చిత్తూరులో కలకలం.. ఇద్దరు చిన్నారుల కిడ్నాప్

Posted: 10/25/2014 11:19 AM IST
Two little girl kids of 7 years old kidnapped in chittoor

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటలో కలకలం రేగింది. ఇద్దరు అమాయక చిన్నారులు కిడ్నాప్కు గురయ్యారన్న వార్త ఇందుకు కారణమైంది. ఆరుబయల ఆటలాడుకుంటున్న ఏడేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులను గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్ చేశారు. తమ పిల్లల కోసం గ్రామమంతా వెతికిన పిల్లల తల్లిదండ్రులు చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిల్లల అదృశ్యంపై వారి దూరపు బంధువుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే చల్లావారిపల్లెకు చెందిన గణేష్, రెడ్డెప్పలు అన్నదమ్ములు. గణేష్ కుమార్తె లావణ్య (7), రెడ్డెప్ప కుమార్తె సంగీత (7)లు రాయలపేటలోని వారి నానమ్మ సంరక్షణలో ఉంటున్నారు. దీపావళి పండగ సందర్భంగా వారు స్వగ్రామానికి వచ్చారు. ఆ రోజు సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలు కనబడకపోవటంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. అయితే పిల్లలిద్దరితో ఓ మహిళతో మాట్లాడిందని, అమె వారిని తీసుకువెళ్లిందని, పిల్లలు అమె వెంట వెళ్లడం తాము చూశామని స్థానికులు తెలిపారు. దీంతో తమ పిల్లలను కిడ్నాప్ చేసింది మదద్లకుంఠకు చెందిన జానకమ్మమేనని భాదితులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girl kids  7 years old  missing  kidnap  lavanya  sangeetha  complaint  challavaripalli  chittoor district  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more