Bihar chief minister warns doctors to chop off hands

jitan ram manjhi, bihar chief minister, chop off hands, warning, doctors, stampede, patna, poor people

bihar chief minister jitan ram manjhi warns doctors to chop off hands

ప్రాణాలతో చెలగాటాలా..? చేతులు నరుకుతానన్న సీఎం.

Posted: 10/18/2014 02:43 PM IST
Bihar chief minister warns doctors to chop off hands

తన కోపంతో నిత్యం పతకశీర్షకన వార్తల్లో నిలిచే బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీకి మరోసారి పట్టలేనంత కోపం వచ్చింది. ఈ సారి వైద్యులు ఆయన ఆగ్రహానికి గురయ్యారు. పేద ప్రజల ప్రాణాలతో ఎవరైనా చెలగాటం ఆడుకున్నారో.. వాళ్ల చేతులు నరికేస్తానని సీఎం మాంఝీ హెచ్చరించారు. మోతీహారీలో ఓ సమావేశానికి హాజరై అక్కడ మాట్లాడుతుండగా ఆయనీ హెచ్చరిక చేశారు. పాట్నా వైద్యకళాశాల ఆస్పత్రికి ఇటీవల ఆయన వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

పాట్నాలో రావణ దహనం సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగి, అక్కడి క్షతగాత్రులు ఆస్పత్రికి వస్తే.. అక్కడ వైద్యులు లేరు, మందులు లేవు, పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది. దాంతో ముఖ్యమంత్రి జీతిన్ రాం మాంఝీకి వైద్యుల మీద ఎక్కడలేని కోపం వచ్చి, సూపరింటెండెంట్ను పిలిస్తే.. ఆయన కూడా లేరు. ఆ విషయాలన్నింటినీ గుర్తుచేసుకున్నారో ఏమో గానీ.. ఇప్పుడు ఇలా చేతులు నరికేస్తానంటూ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన జీతన్ రాం మాంఝీ కారణంగా జేడీయూ తరచు తలపట్టుకోవాల్సి వస్తోంది. అయితే పేదలు మాత్రం ముఖ్యమంత్రి తమకు సేవలందించేందుకు నిత్యం శ్రమిస్తున్నారని భావిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jitan ram manjhi  bihar chief minister  chop off hands  warning  doctors  stampede  patna  poor people  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more