Maharartra polls breaks record

BJP, congress, maharashtra, shivsena, NCP, record, contestants, criminal background, increases

maharartra polls breaks record, as contestants with criminal background increases

ఇదేలే.. తరతరాల (ఎన్నికల) చరిత్రం..

Posted: 10/11/2014 07:44 AM IST
Maharartra polls breaks record

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ప్రజాసేవ పరమార్థంగా ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగ బద్దంగా జరుగుతున్న ఎన్నికలలో వీరు ఎక్కడి నుంచి చోరబడ్డారో తెలియదు. అప్పటి నుంచి వీరు లేకుండా ఎక్కడా ఏ రాష్ట్ర ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగడమే లేదు. ఇంతకీ వారెవరంటారా..? వారే నేరచరితులు.. మహా అసెంబ్లీ సంగ్రామంలో 798 మంది నేర చరితులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగడంతో.. ఎవరికి వారు పోటీ పడి మరి నేరచరితులకు టిక్కెట్లు ఇచ్చారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంధ సంస్థ వెల్లడించింది. సగం మంది అఫిడెవిట్లు పరిశీలించడంతోనే నేర చరితుల సంఖ్య ఇంతలా వుందంటే.. ఇక పూర్తి అభ్యర్థులలలో ఎంత మంది వున్నారోనన్న అనుమానాలను సంస్థ వ్యక్తం చేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 4,119 మంది అభ్యర్థుల్లో 2,336 మంది సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 798 అని తేలిందని ఏడీఆర్ అధినేత మేజర్ జనరల్(రిటైర్డ్) అనిల్ వర్మ వెల్లడించారు. క్రిమినల్ కేసులున్న వారికి ఎక్కువ టికెట్లు ఇచ్చి బరిలో నిలపడంలో పార్టీల్లో శివసేన ముందువరుసలో ఉంది. 278 మంది శివసేన అభ్యర్థుల్లో 169 మంది (61 శాతం)పై క్రిమినల్ కేసులున్నాయని సంస్థ పేర్కొంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  congress  maharashtra  shivsena  NCP  record  contestants  criminal background  increases  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more