Ycp declares bhooma akhilapriya as its cadidate

Bhooma Akhilapriya, YSRCP, Allagadda bypoll, Bhooma Shobha Nagi Reddy

Ycp declares bhooma akhilapriya as its cadidate for allagadda bypoll

వైసీపీ అళ్లగడ్డ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ

Posted: 10/09/2014 04:24 PM IST
Ycp declares bhooma akhilapriya as its cadidate

ఆళ్లగడ్డ శాసనసభకు జరగనున్న ఉపఎన్నికకు దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి తనయ భూమా అఖిలప్రియ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖారారు చేసింది. గత సార్వత్రిక ఎన్నికలకు సమయంలో ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకుంటున్న తరుణంలో రోడ్డ ప్రమాదం సంభవించి శోభానాగిరెడ్డి మరణించారు. ఎన్నికలు చివరి మజలీకి చేరుకున్న తరుణంలో ఎన్నికలను నిలపివేయలేమని అయితే మరోమారు ఉప ఎన్నిక నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దాంతో నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికలో ఆళ్లగడ్డ నుంచి మరణించిన తరువాత కూడా అఖండ విజయం సాధించి దేశంలోని ఓ అరుదైన రికార్డును సాధించారు.
 
అయితే ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నిక సమయంలో పోటీ పెట్టవద్దని  వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ కోరారు. దాంతో నందిగామ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి దింపలేదు. అయితే అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆళ్లగడ్డ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అన్ని పార్టీలతో సంప్రదింపులు చేయటం కోసం వైస్ జగన్మోహన్ రెడ్డి ఒక ద్విసభ్య కమిటీని నియమించారు. దిసభ్య కమిటి సభ్యులుగా ఎంవీ మైసూరా రెడ్డి, ధర్మాన ప్రసాదరావులను ఎంపిక చేశారు. అయితే నందిగామ ఒక్కటే కాదు, ఆళ్లగడ్డలో కూడా తమ ప్రభావాన్ని చాటుతామని గతంలో చెప్పిన కాంగ్రెస్.. ఇక్కడ ఎన్నికల బరిలో ఎవరిని దింపుతుందో మరి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhooma Akhilapriya  YSRCP  Allagadda bypoll  Bhooma Shobha Nagi Reddy  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more