Janasena party not yet registered

Election commission, CEC, notified parties, list, janasena, India, political Parties

Election commission declares notified parties list, janasena is not in the list

జనంలోకి వచ్చినా.. జాబితాలోకి రాని జనసేన..

Posted: 09/25/2014 11:25 AM IST
Janasena party not yet registered

జనంలోకి బలంగా వచ్చిన జనసేన.. జబితాలోకి ఎందుకు రాలేదు..? ఇప్పుడిదే ప్రశ్న పవర్ స్టార్ పవన్ కల్యాన్ అభిమానుల్ని కలవర పరుస్తుంది. ఈ ఏడాది మార్చి 14న జనసేన పార్టీని స్థాపించిన పవన్.. ఆ సందర్భంలోనే తన పార్టీని రిజిస్టర్ చేయాలని పవన్ కల్యాన్ పెట్టుకున్న ధరఖాస్తునే  కేంద్ర ఎన్నికల సంఘం కుదరదని తిప్పి పంపింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా వంద కొత్త పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నా.. జనసేన మాత్రం రిజిస్టర్ కాలేదు.

తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 9 రాజకీయ పార్టీలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవన్నీ ఎన్నికలకు ముందు దరఖాస్తు చేసుకున్న పార్టీలేనని చెప్పింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న జనసేన పార్టీ పేరు మాత్రం తాజాగా ఈసీ విడుదల చేసిన జాబితాలో లేదు.

పార్టీని స్థాపించిన తమ నేత జనసేనను రిజిస్టేషన్ చేయించుకోవడం మరిచాడా..? లేక ఆయన పెట్టుకున్న ధరఖాస్తు కేంద్ర ఎన్నికల సంఘానికి అందలేదా..? అని అభిమానులు కలవర పడుతున్నారు. ఇంతకీ ఏమైంది. తమ పార్టీని కావాలని అధికారులు రిజిస్టర్ చేయడం మరిచారా..? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. అయితే తొందర పడకండి.. దీనిపై పవన్ కల్యాన్ వివరణ ఇస్తారని మరి కొందరు అభిమానులు అంటున్నారు.

 జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Election commission  CEC  notified parties  list  janasena  India  political Parties  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more