దేశవ్యాప్తంగా పదిరాష్ట్రాల్లోని 3 ఎంపీ స్థానాలు, 33 అసెంబ్లీ సెగ్మంట్ల ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు చేరకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ వదులుకోవడంతో గుజరాత్ లోని వడోదర పార్లమెంట్ స్థానం.. ఉత్తర్ ప్రదేశ్ లోని మెయిన్పూర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వదులుకోవడంతో మెదక్ లోక్సభ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వీటితోపాటు.. యూపీలోని 11, గుజరాత్లో 9, రాజస్థాన్లో 4, బెంగాల్లో 2, ఈశాన్య రాష్ట్రాల్లో 5, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇటీవల ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలు కొంత మేరకు పుంజకోగా, బీజేపి బలం మాత్రం కోంత మేర తగ్గింది. ఈ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలు బలాన్ని పుంజుకుంటాయా..? లేక జాతీయ పార్టీలు బీజేపి, కాంగ్రెస్ మధ్య పోటీ వుంటుందా..? అన్నఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఉప ఎన్నికలు కావడంతో ఓటింగ్ శాతం కూడా గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నమోదైన ఓటింగ్ శాతం నమోదు కాకపోవడంతో.. ఏ పార్టీలను విజయం వరించనుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మెదక్ లోక్సభ స్థానం పరిధిలోని పటాన్చెరు, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, మెదక్, సిద్దిపేట శాసనసభ నియోజకవర్గాలకు చెందిన మొత్తం 15,43,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ తరఫున సునీతా లక్ష్మారెడ్డి, బీజేపి-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా తూర్పు జయప్రకాశ్రెడ్డిలు పోటీలో ఉన్నారు. తెలుగు కాంగ్రెస్ పార్టీ, శ్రమజీవి పార్టీ అభ్యర్థులతోపాటు మరో 9 మంది స్వతంత్రులతో కలిపిమొత్తం 14మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అటు కృష్ణా జిల్లాలోని నందిగామ అసెంబ్లీ స్థానంలో కూడా ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ అకస్మిక మృతితో వచ్చిన ఈ ఎన్నికలలో ఆయన కూతురుతో పాటు కాంగ్రెస్, ఇద్దరు ఇండిపెండెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more