Road accident in east godavari district

accident, road accident, flight accident, crashes, bus accident, ambulance, 108 ambulance, ambulance accident, deaths, latest news, andhrapradesh, kakinada, pedhapuram, peddapuram, eastgodawari, hospitals, police, cases

108 ambulance accient with rtc bus in eastgodawari district peddapuram town : three people dead in a road accident near pedhapuram in eastgodawari district ambulance and rtc bus collided

ఆంబులెన్సు ఢీ: ముగ్గురి మృతి

Posted: 09/11/2014 11:13 AM IST
Road accident in east godavari district

ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సు ముగ్గురి మృతికి కారణం అయింది. తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు 108 అంబులెన్సు ఢీ:కొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బాధితుల వివరాల ప్రకారం.., కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెద్దాపురం సమీపంలోని ఏడీబీ రోడ్డు సమీపంలో ఎదురుగా వచ్చిన 108 అంబులెన్సును ఢీ:కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్సులో ఉన్న రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. అటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అంబులెన్సు డ్రైవర్, ఒక పారామెడికల్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలిసులకు సమాచారం అందిచగా ఘటనా స్థలానికి చేరుకున్న వారు.., బాధితులను మరో అంబులెన్సులో కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

అయితే క్షతగాత్రులిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు. చనిపోయిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటు ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు. వీరిని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు ధర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై స్థానికులు, బస్సులోని ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వెళ్లకుండానే రోగి మృతి చెందటం పట్ల అతని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రతికించటం కోసమని అంబులెన్సులో పంపితే.., అదే మృత్యువాహనంలా తీసుకెళ్లిందని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : accident  peddapuram  108 ambulance  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more