దేశంలో సంచలనం రేపిన ఆర్మీ వ్యవహారాల చేరవేత కేసులో రెండవ అరెస్టు జరిగింది. దేశ సైనిక రహస్యాల చేరవేత కేసులో ఆర్మీ జవాను అసిఫ్ అలీని యూపీ పోలిసులు అరెస్టు చేయగా.., హైదరాబాద్ సీసీఎస్ పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో మొదటి నిందితుడు పతన్ కుమార్ పొద్దార్ ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్నాడు. రెండవ నిందితుడు అలీ మీరట్ లో జవానుగా పనిచేస్తున్నట్లు పోలిసులు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ కోర్టులో హాజరు పర్చి పీటీ వారంటుపై హైదరాబాద్ కు తీసుకొచ్చి చంచల్ గూడ జైలుకు తరలించారు.
పతన్ కుమార్ పొద్దార్ తో అనుష్క అగర్వాల్ పేరుతో చాటింగ్ చేసి.., ఆర్మీ వివరాలు సేకరించింది అసిఫ్ అలీ అని గతంలోనే పోలిసుల విచారణలో తేలింది. ఇక పతన్ కుమార్ తో రాత్రి సమయంలో ఫోన్ లో మాట్లాడే మహిళ అలీ భార్యగా గుర్తించారు. ఆమె పాకిస్థాన్ దేశీయురాలుగా ధర్యాప్తులో వెల్లడయింది. దీంతో వీరిద్దరూ పాకిస్థాన్ కోసం పనిచేస్తున్నారని స్పష్టమయింది. ఫేస్ బుక్ ద్వారా పతన్ కుమార్ ను పరిచయం చేసుకుని.., స్నేహం చేసినట్లు నటించి రోజుకు గంటల తరబడి చాటింగ్ చేయటమే కాకుండా నగ్న ఫొటోలు, వీడియోలు ఎరగా వేసి ఆర్మీ రహస్యాలను అసిఫ్ అలీ, అతని భార్య రాబట్టారు.
పతన్ కుమార్ ఆర్మీ క్యాంపులో రాత్రిళ్లు గంటల తరబడి చాటింగ్ చేయటం, ఎక్కువ సమయం ఫోన్లు మాట్లాడటంపై నిఘా పెట్టిన ఉన్నతాధికారులు.., అతడు ఆర్మీ సమాచారం బయటకు చేరవేస్తున్నట్లు తెలిసి షాకయ్యారు. వెంటనే పోలిసులకు ఫిర్యాదు చేయగా.., ధర్యాప్తు చేసిన పోలిసులు పతన్ కుమార్ ను అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం, సైనిక రహస్యాల చేరవేత, ఐటీ చట్టం, సహా ఇతర సెక్షన్లపై తీవ్రమైన నేరాభియోగాలు మోపారు. సైనికుడు అమ్మాయి వలలో పడి సైనిక రహస్యాలను చేరవేయటం దేశంలోనే సంచలనం కల్గించింది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more