Tummala nageswara rao joined trs party in telangana bhavan along with his members

tummala nageswara rao, tummala nageswara rao trs, trs party leaders, telangana bhavan, tummala nageswara rao with kcr, kcr latest news, kcr with tummala, trs party leaders

tummala nageswara rao joined trs party in telangana bhavan along with his members

టీఆర్ఎస్ లోకి చేరిన తుమ్మల తప్పు చేశారు : కేసీఆర్

Posted: 09/05/2014 07:09 PM IST
Tummala nageswara rao joined trs party in telangana bhavan along with his members

(Image source from: tummala nageswara rao joined trs party in telangana bhavan along with his members)

టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు గత కొన్నిరోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరునున్నారనే వార్తలకు తెరపడిపోయింది. ఇప్పటికే టీడీపీ పార్టీకి రాజీనామా ఇచ్చేసిన తుమ్మల... శుక్రవారం సాయంత్రం ఆయన తన అభిమానులతో కలిసి తెలంగాణ రాష్ట్ర భవన్ లో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. తుమ్మలతో వచ్చిన ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ లోకి చేరిపోయారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత - తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితోపాటు టీఆర్ఎస్ నేతలు కే.కేశవరావు, రమణాచారి తదితరులు పాల్గొన్నారు.

ఇందులో భాగంగా తుమ్మల నాగేవ్వరరావు మాట్లాడుతూ... విభజన అనంతరం ఖమ్మం జిల్లాలకు ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపణలు చేశారు. కేవలం తాను ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయడం కోసమే టీఆర్ఎస్ లోకి చేరానని... సీటు మీద తనకు ఏమాత్రం మోజులేదని తెలిపారు. గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను సరిదిద్దుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నారు. అలాగే తెలంగాణను బంగారు తెలంగాణాగా మార్చాలన్న సీఎం లక్ష్యాన్ని నేరవేర్చడానకి తానూ కృషి చేస్తానని.. అందుకే పార్టీలోకి చేరానని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మార్పులకు కేవలం తాను, కేసీఆర్ మాత్రమేనని చెప్పిన ఆయన.. కేసీఆర్ నేతృత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మాట్లాడుతూ.. ఇందులో తప్పు నాది కాదు తుమ్మలదేనని ఆయన నవ్వుతూ అన్నారు. తుమ్మల పార్టీలో చేరుతున్నారంటే ఇంతమంది వస్తారని తాను ఊహించలేదని.. కానీ భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలకు స్వాగతం పలుకుతున్నానని అన్నారు. తుమ్మల అనుచరగణంతో టీఆర్ఎస్ భవన్ పూర్తిగా నిండిపోయింది. ఇది చూసి సంతోషించిన కేసీఆర్.. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసి వుంటే బాగుండేదని.. కానీ ఇంతమంది వస్తారన్న విషయాన్ని తుమ్మల నాతో చెప్పలేదని.. తానూ కూడా ఊహించలేదని అన్నారు. అందుకే ఇందులో తప్పు తనది కాదని.. తుమ్మలదేనని చమత్కరించారు.

అలాగే.. ఖమ్మం జిల్లాపై పూర్తి అవగాహన ఉన్నందున పాతవాళ్లను, కొత్తవాళ్లను కలుపుకుని టీఆర్ఎస్ ను ముందుకు తీసుకువెళ్లాలని తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్- కోరారు. కేవలం అభివృద్ధిని మాత్రమే అజెండాగా పెట్టుకుని తుమ్మల పార్టీలోకి చేరారని చెప్పిన ఆయన... ఖమ్మం జిల్లాను పూర్తిగా అభివృద్ధి చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మంను విభజించి మరో జిల్లాను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్-అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tummala nageswara rao  kcr  telangana bhavan  trs party leaders  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more