అన్యాయాన్ని ప్రశ్నించటమే ఆ బాలిక చేసిన పాపం అయింది. తండ్రిపై జరిగిన దాడిని ప్రశ్నించినందుకు మృగాళ్ళ చేతిలో బలయింది. తండ్రిపై ఉన్న కక్ష్యతో అతని కూతురుపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. అదికూడ మహిళా రాజకీయ నేత అనుచరులు. సాటి మహిళ అనే సానుభూతి కూడా లేకుండా ఈ దారుణానికి మహిళా నేత అనుచరులను ఉసిగొల్పింది. పశ్చిమబెంగాల్ లో జరిగిన ఈ దారుణం ప్రస్తుతం రాష్ర్టంలో అధికార, విపక్షాల మద్య ఉద్రిక్తతలకు దారి తీసింది.
జాల్పాయిగురి జిల్లా దిప్గురికి చెందిన ఓ దళిత రైతు స్థానికంగా ఉండే భూస్వామి ట్రాక్టర్ తీసుకుని పొలం సాగు చేశాడు. ట్రాక్టర్ వాడుకున్నందుకు డబ్బులు ఇచ్చే విషయంలో ఇద్దరి మద్య విభేదాలు వచ్చాయి. డబ్బుల కోసం భూస్వామి అధికార పక్ష నేత, స్థానికంగా ఉండే నమితారాయ్ ను ఆశ్రయించాడు. పంచాయతి పెట్టిన మహిళా నేత.., మిగతా డబ్బులు ఇవ్వాలని ఆదేశించింది. నెలలోపు మొత్తం రూ.40వేలు చెల్లించాలని హుకుం జారీ చేసింది. తీర్పు సరిగాలేదని రైతు మాట్లాడగా అతనిప నమిత అనుచరులు.. పంచాయతీలోనే దాడి చేసి గాయపరిచారు.
తండ్రిపై దాడిని తట్టుకోలేకపోయిన రైతు కూతురు పంచాయతీ పెద్దలు, నమితా రాయ్ ను నిలదీసింది. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. నన్నే ప్రశ్నిస్తావా అంటూ నేలపై ఉమ్మేసి నాలుకతో నాకమని ఆదేశించింది. వెంటనే తండ్రి కూడా నమిత పై తిరగబడ్డాడు. ఇదేం పంచాయతి.., మీరేం పెద్దలు అని ఎదిరించాడు. కొద్దిసేపు గొడవ తర్వాత రెండు వర్గాలు పంచాయతీ నుంచి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత కొద్ది సేపటికి రైతు కూతురు కన్పించకుండాపోయింది. ఆ తర్వాత కొద్దిగంటల్లో నగ్నంగా శవమై రైలు పట్టాలపై పడి ఉంది. పాఠశాలకు వెళ్లే బాలికను దారుణంగా అత్యాచారం చేసిన మృగాళ్ళు హత్య చేసినట్లు స్పష్టం అవుతోంది.
పోలిసులు కంప్లయింట్ తీసుకోలేదు
బాలిక మృతితో గ్రామంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. విషయం తెలిసిన తండ్రి నమితపై ఫిర్యాదు చేయగా.., పోలిసులు కనీసం కంప్లయింట్ తీసుకోవటానికి కూడా ఆలోచించారు. చివరకు రైతుకే నచ్చజెప్పారు. అయితే విషయం బయటకు పొక్కి విపక్షాలకు తెలిసింది. రంగంలోకి దిగిన సీపీఎం బాధిత కుటుంబం పక్షాన నిలిచింది. రాజకీయ జోక్యంతో కదిలిన పోలిసులు ఎట్టకేలకు కంప్లయింట్ తీసుకున్నారు. అయితే నిందితులను మాత్రం పట్టుకోకుండా తాత్సారం చేశారు. మళ్ళీ రాజకీయ పార్టీలు ఆందోళన చేయటంతో..., ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం నమితా రాయ్, ఆమె భర్త పరారీలో ఉన్నారు. వీరికోసం గాలింపు కొనసాగుతుంది.
మరోవైపు బాలికను అత్యాచారం చేయలేదని పోలిసులు చెప్తున్నారు. అయితే మృతదేహాన్ని చూస్తే అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆధారాలు కన్పిస్తున్నాయని బాలిక తండ్రి, విపక్షాలు చెప్తున్నాయి. పోస్టుమార్టం చేసి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని ఆందోళన చేశాయి. దీంతో స్పందించిన జిల్లా ఎస్పీ ఫోరెన్సిక్ పరీక్షః చేయిస్తామని హామి ఇచ్చారు. నిందితులందర్నీ పట్టుకుంటామని చెప్పారు. అమ్మాయి అనే దయ లేకుండా దారుణంగా అత్యాచారం చేసి, హత్యకు ఉసిగొల్పిన నమితా రాయ్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more