(Image source from: 9 hyderabadi members raped and tortured a girl in farm house)
రానురాను మనుషుల్లో మానవత్వం పూర్తిగా మంటగలిసిపోతోంది. మనుషులమనే విచక్షణను మరిచిపోయి మృగాల్లాగా ప్రవర్తించడం మొదలుపెట్టేస్తున్నారు. ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు.. అంతే! ఆ అమ్మాయిని కుక్కలకంటే హీనంగా పీక్కుతిండం మొదలుపెట్టేస్తారు. ఆమధ్య ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిన విషయమే! ఆ సంఘటనలో ఒకమ్మాయిని ఏడుగురు వ్యక్తులు మృగాల్లా దారుణంగా అత్యాచారం చేశారు. దాంతో ఆ అమ్మాయి తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. కేవలం ఈ ఘటన మాత్రమే కాదు.. దేశం నలుమూలల ఎక్కడో ఒకచోట అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంస్కృతీ - సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మన భారత్.. అత్యాచారాలపర్వం ఎక్కువవడంతో ‘‘రేప్ కంట్రీ’’గా మారిపోతోంది.
ఇదిలావుండగా.. తాజాగా భాగ్యనగరంలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తామూ సాటి మనుషులమేనన్న విచక్షణనను కోల్పోయి.. ఒక ప్రేమజంట పట్ల ముఖ్యంగా అమ్మాయి పట్ల విచక్షణరహితంగా ప్రవర్తించారు. హైదరాబాద్లోని పహాడీ షరీఫ్లో ఒక జిమ్ కోచ్, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అటుగా వెళ్తున్న ఒక ప్రేమజంటను చూశారు. అంతే! చుట్టుపక్కల ఎవరూలేరని గమనించిన వాళ్లు.. ఆ ప్రేమజంటను అక్కడినుంచి గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి ఒక ఫాంహౌస్లో బంధించారు. యువతిపై 9మంది కామాంధులు ఒకరితర్వాత ఒకరు సామూహిక అత్యాచారం చేస్తూ.. నరకం చూపించారు. వదిలేయండంటూ ఎంత వేడుకున్నా.. ఆమె మీద వారికి దయ మాత్రం రాలేదు.
అంతటితో ఆగకుండా.. ఆ యువతి నగ్న ఫోటోలను తీసి వాటిని ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. ఆమెపై జరిగిన దారుణాన్ని కెమెరాకెక్కించారు. అప్పటికీ వారి శాడిజం ఆగలేదు.. ఆ ప్రేమజంటను బంధించిన గదిలో పాములను వదిలిపెట్టి పైశాచిక ఆనందాన్ని పొందారు. ఆ జంట అనుభవించరాని కష్టాలను చవిచూశారు. అయితే ఎలాగోలా వారినుంచి తప్పించుకుని వచ్చిన ఆ జంట.. పహాడీషరీఫ్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించేశారు. దీంతో వారు జిమ్ కోచ్ దయాని, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖాదర్, తయ్యబ్లతోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more