Power problems in telangana state increased farmers life in danger

power problems, telangana power problems, current problems telangana, ap genco, ap transco, telangana transco, telangana genco, trs party leaders, cm kcr

power problems in telangana state increased farmers life in danger : the power problems in telangana state is increased than past so that the people and farmers getting more problems

తెలంగాణాను ఆవహించిన చీకటి భూతానికి ప్రజలు బలి!

Posted: 08/22/2014 12:49 PM IST
Power problems in telangana state increased farmers life in danger

విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో లోపాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యామా అని మన రాష్ట్రాలు అక్రమాలతో పూర్తిగా మునిగిపోయాయి. కనీసం డెవలప్ మెంట్ కాదు కదా.. వున్న వనరులన్నింటినీ ఆ ప్రభుత్వం ఊడ్చుకుపోయింది. దీంతో ఇటు తెలంగాణాలో, అటు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వనరుల లోటు ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ విషయాలు అటుంచితే... తెలంగాణాలో తాజాగా చీకటి భూతం బాగానే ఆవహించినట్టు కనిపిస్తోంది. దీని ధాటికి తట్టుకోలేక ఇక్కడున్న ప్రజలు ముఖ్యంగా రైతన్నలు విలవిలలాడుతున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని భయంతో జీవితాన్ని నెట్టుకుపోతున్నారు. విభజన తర్వాత మంచి రోజులు వస్తాయని ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న ప్రజలకు... ఇలా చీకటి భూతంగా వారికి సరికొత్త కష్టాలను తెచ్చిపెడుతోందని ఎవరూ ఊహించుకోలేకపోయారు.

ఇక్కడ చీకటి భూతం అంటే.. విద్యుత్ కొరత! తెలంగాణాలో విద్యుత్ కొరత గతంలో కంటే ఇప్పుడు మరింత తీవ్రతరమైంది. కరెంట్ కష్టాలు చాలా ఎక్కువగా పెరిగిపోవడంతో తెలంగాణా పల్లెప్రాంతాల్లో వుండే ప్రజలు, రైతులు విలవిలలాడుతున్నారు. అసలు పగటి పూట కరెంట్ వస్తుందన్న సంగతినే వారు మర్చిపోయారు. అంతటి దారుణ పరిస్థితులు వచ్చేశాయి. ఇక రాత్రివేళ్లలో కూడా కరెంట్ చాలా పరిమితంగా సరఫరా అవుతోంది. సామాన్య ప్రజల విషయమేమోగానీ.. రైతులతే కరెంట్ కష్టాలతో ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. రోజు మొత్తం మీద రెండు నుంచి నాలుగు గంటల మధ్యే పొలాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. అది కూడా దఫాదఫాలుగా చేస్తుండటంతో.. కొద్దికొద్దిగా వస్తున్న నీళ్లు పొలాన్ని తడపలేకపోతున్నాయి. దీంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమయసందర్భమంటూ ఏమీ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు కరెంట్ తీసేయడం వల్ల గృహ వినియోగదారులు, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులు, కరెంటుపై ఆధారపడ్డ కులవృత్తుల వారు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో సాఫీగా జరుగుతున్న వారి జీవన విధానంలో ఇప్పుడు ఈ కరెంట్ కోతలు చీకటి భూతంలా మారిపోయాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా దాదాపు ఆరుగంటలకు పైగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారంటే.. విద్యుత్ సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత ఘోరమైన పరిస్థితికి రావడానికి కారణమైన ఈ కరెంట్ కోతల సమస్యల్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది.

విద్యుత్ లోటు అసాధారణ స్థాయికి చేరుకుందని... డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోతలు అమలుచేస్తున్నామని విద్యుత్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నా. ఈ విషయంలో ట్రాన్స్ కో, జెన్ కో ఉన్నతాధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. డిమాండ్‌ 154 మిలియన్‌ యూనిట్లు ఉండగా...ఉత్పత్తి 128 యూనిట్లు ఉందని...దీని వల్ల 25 మిలియన్ యూనిట్లు లోటు ప్రతీరోజు వస్తుందని వారు అంటున్నారు. ఈ కారణంగా విద్యుత్ కోతలను అమలుచేయని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వారు చెబుతున్నారు. మరి ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తానంటూ వాగ్ధానాలు చేసిన కేసీఆర్.. ఈ సమస్య మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ ప్రముఖులతోపాటు సామాన్య ప్రజలు కూడా ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. మరి ఈ ప్రశ్నలకు ఆయన జవాబులు ఎప్పుడు విప్పుతారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana state  telangana power probles  telangana farmers  kcr  genco  transco  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more