(Image source from: cm kcr met child heart patient in apollo hospitals)
తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనదైన తెలంగాణ యాసలో ప్రత్యర్థులను మాటల తూటాలతో కుళ్లబొడిచడంలో ఈయనకు ఈయనే సాటి. ఏ నేతనైనా సరే.. వారిలో వున్న తప్పులను, చెడు గుణాలను పీల్చిపిప్పి చేసి, గూపిలాగి మరీ వ్యాఖ్యలు చేస్తారు. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ఇన్నాళ్లవరకు మనమందరం ఉగ్రరూపాన్ని మాత్రమే చాలా ఎక్కువ సందర్భాల్లో చూశాము. అయితే ఆయన ఎంత పక్కా రాజకీయవేత్తో అంతే నికార్సైన మానవతావాది కూడా! అందుకు ఆయనకు సంబంధించిన తాజా సంఘటనను ఉదాహరణగా తీసుకోవచ్చు.
వరంగల్ జిల్లాలోని నర్మెట్టకు చెందిన శరత్ అనే ఓ చిన్నారి గుండెజబ్బు కారణంగా మృత్యువుతో పోరాడుతున్నాడు. దీంతో అతనికి మెరుగైన చికిత్సను అందించేందుకు అతని కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ చిన్నారి ఒక అరుదైన కోరిక కోరాడు. చివరి సారిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూడాలనుందని తన మనసులోని మాటను వెల్లడించాడు. ఇక అంతే సంగతులు!
ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్.. మరేమీ ఆలోచించకుండా తన పనులన్నింటినీ వదిలేసి మరీ ఆ అబ్బాయిని కలవడానికి అపోలోకి పయనమయ్యారు. అక్కడ చిన్నారి శరత్ ను పరామర్శించి తన పెద్ద మనుసును చాటుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. శరత్ కు మెరుగైన చికిత్స కోసం ఎంత ఆర్థిక సాయం చేయడానికైనా సిద్ధమని, అతని కుటుంబం కోసం ప్రత్యేకంగా ఒక ఇంటిని కూడా నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇలా ఈ విధంగా ఆయన తనలో వున్న మానవత్వాన్ని చాటిచెప్పారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more