Jagan fire on chandrababu

jagan mohan reddy, ysrcp, ysr congress, ys rajashekar reddy, ys death, jagan case, cbi, jagan mohan reddy, vijayamma, sharmila, brother anil kumar, ys bharati, jagan odarpu, ysrcp leaders, krishna district, chandrababu naidu, tdp leaders, telugu desam party, vijayawada, telugu news, latest updates

jagan condolences to krishna rao family in kanchikarla in krishna district : jagan fires on chandrababu naidu says tdp leaders attacking ycp partymen accuses police also supporting tdp

నిండు సభలో చంద్రుడిని నిలదీస్తా

Posted: 08/13/2014 12:45 PM IST
Jagan fire on chandrababu

అధికారంలో ఉన్న చంద్రబాబు తమ పార్టీ నేతలను చంపుకుతింటున్నారని జగన్ మండిపడుతున్నారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు, దాడులు పెరిగాయని ద్వజమెత్తారాయన. కృష్ణా జిల్లా గొట్టుముక్కల గ్రామంలో హత్యకు గురైన కృష్ణారావు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కృష్ణారావు హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు ఎవరూ అదైర్య పడవద్దని తాను వారి ప్రాణాలకు అడ్డుపడతానని చెప్పారు జగన్. కేవలం ఓటు వేయలేదనే కోపంతో ఇంట్లోకి వెళ్ళి అతి దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నా కనికరం లేకుండా కళ్ళెదుటే ప్రాణాలు తీయటం హేయమైన చర్యగా జగన్ బాధపడ్డారు.

కృష్ణా జిల్లాలో గతంలోనూ దేశం నేతలు వైసీపీపై దాడులు చేశారని జగన్ ఉదాహరణలు వివరించారు. ఇంతకుముందు ఓ వైసీపీ కార్యకర్త నెత్తిపై బాంబు పెట్టి దారుణంగా చంపారని గుర్తు చేశారు. టిడిపి నేతల చేతిలో చాలామంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని చెప్పారు. ఎన్ని దాడులు జరుగుతున్నా పోలిసులు మాత్రం స్పందించటం లేదని ఆరోపణలు చేశారు. ఖాఖీలు కూడా పరోక్షంగా అధికారపార్టీకి సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. పరిస్థితి ఇలాగే ఉంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దాడులు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోపోవటం మంచిపద్దతి కాదని జగన్ అన్నారు. ఇలా చేస్తే వారిని మరింత ప్రోత్సహించినట్లవుతుందన్నాు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మానవత్వమే లేదని మండిపడ్డారు. దాడుల గురించి అసెంబ్లీలో నిలదీస్తానని స్పష్టం చేశారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదన్నారు. టిడిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తాము ఎప్పుడూ పోరాడుతామన్నారు. రాజన్న కన్న కలలను నిజం చేయటం కోసం కృషి చేస్తానని ప్రజలకు జగన్ హామి ఇచ్చారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  chandrababu naidu  ysrcp  tdp  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more