లోకంలో గుండు కొట్టించుకోనివాడు వున్నాడేమోగానీ... ‘‘గూగుల్’’ తెలియనివాడు ఎవడూ వుండడు. ఒక మనిషి తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ‘‘యాహూ’’ అనకుండా వుండలేరు. ఇప్పుడు గూగుల్ గోడ దూకిందంటే.. ఏదో పార్టీలోకి జంప్ చేసిందని కాదు.. తనకోసం కొత్త పార్ట్నర్ ని తెచ్చుకుంది. అదే యాహూ! ఇక నుంచి అందరూ ‘‘యాహూ-గూగుల్.. గూగుల్-యాహూ’’ అనాల్సిందే! అంతా మన మంచికే! అయితే ఈ రెండు ఇలా కలుసుకున్నాయి....
ప్రస్తుతకాలంలో నెటిజన్ల ఇంటర్నెట్ లో ఎక్కువ ఉపయోగించింది ఈమెయిల్ వ్యవస్థ. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఒకరోజు రన్ చేయకపోయినా నెటిజన్లు వుండగలరు కానీ.. ఈమెయిల్ వ్యవస్థ లేకపోతే మాత్రం వుండలేరు. ఎందుకంటే.. ఇది కేవలం చాటింగ్ చేసుకోవడానికి మాత్రమే కాదు... సంస్థలు తమకు సంబంధించిన కొన్ని సీక్రెట్ విషయాలను చర్చించుకోవడానికి వీలుగా వుంటుంది. దాదాపు ప్రపంచంలో వున్న ప్రముఖ కంపెనీలన్నీ ఈ ఈమెయిల్ వ్యవస్థ ద్వారా సంభాషణలు నడుపుతుంటాయి. ఈ సౌకర్యం లేకపోతే ఆరోజు కార్యక్రమాలన్నీ ఆగిపోవాల్సిందే! అంత బిజీగా రన్ అవుతుంటుంది ఈ ఈమెయిల్ వ్యవస్థ!
అటువంటి ఈమెయిల్ వ్యవస్థను మరింత సురక్షితంగా తయారుచేయడానికే గూగుల్ - యాహూ సంస్థలు చేతులు కలుపుతున్నాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కలిసి రూపొందిస్తున్న ఈ కొత్త ఈమెయిల్ సర్వీసును హ్యాకర్లుగానీ, అటు ప్రభుత్వాలు సైతం ఛేధించలేనంత దుర్భేద్యంగా వుంటుందని యాహూ పేర్కొంది. గతంలో కొంతమంది హ్యాకర్లు వేలాది ఈమెయిళ్లను హ్యాక్ చేశారని.. కొన్ని కోట్లమేర డబ్బులను తమ ఖాతాల్లో జమ చేసుకున్నారని సదరు సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే అలా జరగకుండా వుండటం కోసమే తాము ఈ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్టు అవి పేర్కొన్నాయి.
ఇటీవలే కాలంలో అమెరికా నిఘా సంస్థలు ఎవరి అనుమతి లేకుండానే కొన్ని వేలాది ప్రైవేటు మెయిళ్లను పరశీలించినట్లు ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రపంచడానికి వెల్లడించడం జరిగింది. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించిన నేపథ్యంలో ఈమెయిల్ సర్వీసుకు మరింత భద్రత కల్పించేందుకు యాహూ - గూగుల్ ఇలా చేతులు కలపాల్పి వచ్చిందని అవి స్పష్టం చేశాయి. అయితే ఒక చిన్న బ్యాడ్ న్యూస్! ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి ఒక సంవత్సరం పడుతుందని ఆ సంస్థలు పేర్కొంటున్నాయి. అంటే వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త ఈమెయిల్ సంస్థ అమలులోకి వస్తుందని అవి వెల్లడించాయి.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more