అ నాలుగు దేశాల్లో పుట్టిన అమ్మాయిలు పెళ్లి పనికిరారా? అనే సందేహం అందరికి కలుగుతుంది. కానీ ఒక దేశం అబ్బాయిలకు.. కొత్త షరతులు పెట్టింది. ఎట్టి పరిస్థిత్తుల్లో ఆ నాలుగుదేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దని ఒక జీవో జారీ చేసింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే? పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్.. ఈ నాలుగు దేశాల అమ్మాయిలను పెళ్లిచేసుకోవద్దని సౌదీ అరేబియా అబ్బాయిలకు ఆ దేశం ఆంక్షలు విధించింది. బహిష్కృతులను సౌదీ పురుషులు పెళ్లిచేసుకోవద్దన్న నిబంధనల్లో భాగంగా ఈ ప్రకటన వెలువడినట్టు తెలుస్తోంది.
ఇతర దేశాల నుంచి వలసవచ్చి సౌదీలో నివసించేవారిని స్థానికంగా బహిష్కృతులుగా పేర్కొంటారు. సౌదీలో పాకిస్థాన్, బంగ్లాదేవ్, చాద్, మయన్మార్ దేశాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. అందులో ఆ నాలుగుదేశాలకు చెందిన అమ్మాయిలు ఐదులక్షల మంది ఉంటారని ఓ అంచనా. నిబంధనల్లో భాగంగా ఆ అమ్మాయిలను మనువాడరాదని పోలీసులు తేల్చిచెప్పారు.
పెళ్లికి సంబంధించిన నిబంధనలు ఈ మధ్య సౌదీలో మరింత కఠినతరం చేశారు. విదేశీ మహిళలను పెళ్లిచేసుకునేందుకు తప్పనిసరిగా అనుమతి స్వీకరించాల్సి ఉంటుందని పోలీసులు అంటున్నారు. పెళ్లికి దరఖాస్తు చేసుకునేవారి వయసు 25ఏండ్లు నిండి ఉండాలి. పైగా స్థానిక అధికారుల నుంచి అనుమతి పత్రాలు కూడా జతచేయాలి. అయితే ఈ ఆంక్షలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడలేదు!
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more