తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మాటలు విపక్షాలకు ఎంత నిశితంగా తగుల్తాయో ఆయన అభిమానుల గుండెల్లో అంతగా గిలిగింతలుపెడతాయి. అందువలన ఆయన సభకు వచ్చేవాళ్ళంతా ఆయన ఏదో కొత్తరకంగా విమర్శలు గుపిస్తారని, మా బాగా ఎత్తిపొడుపులతో, వ్యంగ్యాస్త్రాలతో, హాస్య ఛలోక్తులతో నవ్విస్తూ, కవిస్తూ మాట్లాడుతారని, అది వినటానికే వస్తారు. వేదిక మీద ఉన్న నాయకులు కూడా నవ్వుతూనేవుంటారు. అలా ఆయనకంటూ తెలంగాణా అభిమానులు చాలామంది ఉన్నారు ఆయన నోటి లోంచి వచ్చే మాటలను విని హాయిగా నవ్వుకోవటానికి ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఆయన విమర్శించేది ఆంధ్రోళ్లని, చంద్రబాబు నాయుడినే కాబట్టి.
ఇక ఆయన ప్రతిసారీ మీడియా ముందుకు వచ్చి తన వ్యాఖ్యలను వినిపించాల్సిన అవసరం లేకుండా కెసిఆర్ సోషల్ మీడియాను ఉపయోగించుకోబోతున్నారు. ట్విట్టర్లో తన వ్యాఖ్యలు ప్రతిరోజు వెల్లడించబోతున్నారు. ఫేస్ బుక్ ముఖ్య మంత్రి కార్యాలయం అకౌంట్ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలను తెలియజేయబోతున్నారు. దాని ద్వారా తెలంగాణా ప్రజల మనోభావాలను ఎప్పిటికప్పుడు ప్రజల స్పందనద్వారా తెలుసుకోబోతున్నారు. అంటే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువలోకి వెళ్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవబోతున్నారు.
కాకపోతే వచ్చిన సమస్యేమిటంటే, తెలుగులో ఆయన మాటల ధాటి సోషల్ మీడియాలో కనిపించకపోవచ్చు. మరొక విషయమేమిటంటే, ఆయన మాటలు విని వెంటనే కరతాళ ధ్వనులతోనో, లేక కేరింతలతోనూ ప్రేక్షకులు వాళ్ళ స్పందన తెలియజస్తున్నప్పుడు వచ్చే కిక్ వేరు. ఉత్సాహం రెట్టంపవుతుంది, మాటల జోరు పెరుగుతుంది, వినేవాళ్ళకి ఇంకా పసందుగా ఉంటుంది. కానీ ట్విట్టర్లో అవేమీ ఉండవు. కానీ ఫాలోయింగ్ మాత్రం బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more