సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ లకు స్టూడియోల కోసం తక్కువ ధరకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలలో పూర్తిగా ఆ పని కోసం వినియోగించుకోకపోవటం, ఇతర వ్యాపారాలకు వాడుకోవటం లాంటి ఫిర్యాదులో గతంలో కూడా వచ్చాయి కానీ ఆ ప్రభుత్వాలు ఆ విషయంలో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎకరం ఐదు లక్షలు పలుకుతున్న సమయంలో ఆ భూములను ఎకరానికి కేవలం ఎనిమిదివేల చొప్పున వసూలు చేసి కేటాయించారు. నాలుగు నుంచి ఐదు వందల కోట్ల వరకు విలువచేసే ఈ భూములను లోగడ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటానికి చూడగా అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హైద్రాబాద్ లోని భూముల మీద దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఏ అక్రమ నిర్మాణాలను, అక్రమ వినియోగాలను, కబ్జాలను వదిలిపెట్టవద్దని, నోటీసులు కూడా ఇవ్వవలసిన పనిలేదు, కూల్చివేయండని విస్తృత మైన అధికారాలను ఇవ్వటంతో హైద్రాబాద్ భూముల క్రమబద్ధీకరణ కొనసాగుతోంది. కమిషనర్ ఎస్ కె సిన్హా ఈ భూమల దుర్వినియోగం జరిగిందని అనటంతో భవిష్యత్తులో ఈ భూముల విషయంలో ఏం జరగబోతుంది, మరేమి రాబోతున్నాయని సినీ పరిశ్రమలో బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఆయన తండ్రికి కేటాయించిన భూమి విషయంలో ఆదుర్దాగానే ఉన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more