పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజల సంక్షేమం కోసమంటూ ‘‘జనసేన’’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే! అయితే ఈ పార్టీకి గుర్తింపు రాకపోవడంతో ఇన్నాళ్లవరకు ఈ పార్టీకి సంబంధించిన విషయాలు తెరపైకి రాలేదు. ఈ నేపథ్యంలో తమ పార్టీకి గుర్తింపు లభించేలా ఆ పార్టీ సిబ్బంది ముందడుగు వేసినట్టు కనిపిస్తోంది. తాజాగా ఎన్నికల కమీషన్ వద్ద జనసేన పార్టీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నామని, దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు వుంటే ఇప్పుడే తెలిపాలని ఆ పార్టీ కోరింది. ఈమేరకు ఆ పార్టీ శుక్రవారంనాడు ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఎవరైనా పార్టీని నమోదు చేయించుకుంటే... అందుకు సంబంధించి బహిరంగంగా ప్రకటన చేయాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కూడా తన తరఫున ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ముందు పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్.. ఆ సమయంలో పోటీ చేసేందుకు తక్కువ అభ్యర్థులు వుండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తొలిసారిగా తెలంగాణా నుంచి ఆ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజకీయ రణరంగంలో ప్రవేశించబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ కూడా పాల్గొనేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటోందని సమాచారం!
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more