ఉమ్మడి రాజధాని హైద్రాబాద్ లో శాంతి భద్రతల విషయంలో ఏమీ తేల్చలేక చేతులెత్తేసింది కేంద్ర ప్రభుత్వం. గవర్నర్ కి శాంతి భద్రతల బాధ్యతను అప్పగించాలా వద్దా అన్న విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలనుంచి వెళ్ళిన ప్రతినిధులు తమ తమ వాదనలు గట్టిగా వినిపించారు. ఎవరూ తగ్గకపోయేసరికి, ఇంతోటిదానికి ఇక్కడిదాకా ఎందుకొచ్చినట్లంటూ కేంద్ర ప్రభుత్వం చిరాకు చూపించింది. అలాగే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద కూడా చర్చ జరిగింది. అందులోనూ ఎవరూ తగ్గలేదు. చివరకు మేము చట్టం చేసాం ఇక మీరే తేల్చుకోండని కేంద్రం చేతులెత్తేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి అనిల్ గోస్పామితో ఢిల్లీలో భేటీ అయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం, ఏం చెప్పాలో పాలుపోని కేంద్రం ఇక ఇందులో చర్చించేందుకేమీ లేదు. చట్టంలోనే అంతా ఉంది చూసుకోండని అనటం జరిగింది. చట్టంలో ఉన్నమాట నిజమే కానీ దాని అమలు గురించే కదా వివాదమంతా అని అంటే, ఇది చాలా సున్నితమైన సమస్య, ఇందులో నేనేమీ మాట్లాడటానికి లేదు, ఇరు రాష్ట్రా ప్రభుత్వాలూ మీమీ వాదనలనే గట్టిగా పట్టుకుని కూర్చుంటే నేను చేసేదేమి లేదన్నారు గోస్వామి.
అదీ అసలు సంగతి. ఎవరినీ నొప్పించదలచుకోలేదు కేంద్ర ప్రభుత్వం. మీరు మీరు తేల్చుకోండి అనేదానికి ఇక్కడిదాకా ఎందుకు పిలిపించినట్లని రాష్ట్రాల నుంచి వెళ్ళిన ప్రతినిధులు కూడా అన్నారు. ఇక అధికారుల స్థాయిలో చర్చించి కూడా ప్రయోజనం లేదని అర్థమై వృధా ప్రయాసే అయిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధే ఎక్కవగా బాధపడ్డట్టుగా తెలుస్తోంది.
ఇక ఇతర అంశాలైన జలాల పంపిణీ లాంటి సమస్యలకు కూడా కేంద్రం లో ఎటువంటి పరిష్కారాన్నీ చూపలేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more